Wednesday, September 3, 2025

వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్


ఇక్కడ స్వామి పంచ రూపాలతో దర్శనం ఇస్తాడు. 

ఆలయంకు సంబందించిన సమాచారం అంతర్జాలంలో ఇక్కడ లభిస్తున్నది. 

నందిగామలో తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల వారి బండి తీసుకుని వెళ్ళటం జరిగింది. సుమారు ౩౦ కిలోమీటర్లు దూరం ఉండవచ్చు. హైవే మీదనుంచి లోపలకి వెళ్ళటం, చిన్న చిన్న పల్లెటూళ్ళు కావటం లైట్లు పెద్దగా లేకపోవటం ఒకరకమైన భయానికి లోనైతే స్వామే వచ్చారా అన్నట్టు ఒకాయన ఒక పల్లెటూరు వచ్చేవరకు  వచ్చి వెళ్లిపోయారు. రాత్రిలోపు చేరుకొని దర్శనం చేసుకుని వచ్చేద్దామనుకుని బయలుదేరిన మేము రూట్ కొత్త అవ్వ్వటం వల్లన, ఊరి పేర్లు తెలియక, చిమ్మ చీకటిలో ఒక చిన్న పల్లెటూరు వచ్చాక దర్శనం ఇక దొరకరదు తిరిగి వెళ్ళిపోయి పొద్దునే వద్దామనుకుని వెనక్కి వెళ్ళిపోయాము. ఐతే ఒక్క పడుకోవటానికి చాలా మంది వెళతారు అని కూడా చెప్పారు. 

తరువాత రోజు మేము మొదటగా ఎదురయ్యే (5-6KM) గరుడాచలం కొండ మీద వీర నరసింహ స్వామిని దర్శించుకున్నాము. మేము వెళ్లేసరికి ఎవరు లేరు.కింద స్టాఫ్ ఒకరు వున్నారు. మట్టి రోడ్ వుంది కాని ఎత్తు ఎక్కువ వుంది. సరిగా లేదు. మెట్ల దారిలోనే వెళ్లమన్నారు. పైన ఆలయం మూసి వుంది. కానీ స్వామి దర్శనం అవుతుంది. కింద పంతులు గారి ఇల్లు వుంది. ఇంత రిమోట్ ఏరియాలలో ఒకసారి రావడానికే ఇలా ఉంటే స్వామినే నమ్ముకుని బతుకుతున్న పూజారుల జీవితాలు, కుటుంబ సభ్యుల త్యాగం చాలా గొప్పది అనిపించింది. తప్పక నమ్ముకున్న స్వామి కరుణిస్తాడు అనిపించింది.

తరువాత వేదాద్రి ఆలయం చేరుకున్నాం. ఆరోజు స్వామి కళ్యాణం జరుగుతుండటం వల్ల చాలామంది భక్తులు వచ్చారు. అక్కడ నదిలో సాలగ్రామ నరసింహ, అక్కడే కనిపించే కొండ మీద మెట్లు ఎక్కి పైకి వెళ్ళితే జ్వాలా నరసింహ, క్రింద ఆలయంలో యోగానంద, లక్ష్మీ నరసింహ స్వామివార్ల దర్శనం చేసుకున్నాం. 

ఫండ్స్ తక్కువగా ఉండటం వల్లనేమో గాని అన్నదానం అప్పటికే అయిపొయింది. ఒకటి, ఆరా షాపులలో కూల్ డ్రింక్స్ కొన్ని స్నాక్స్ తప్ప పెద్దగా తినటానికి ఏమి లేవు. అన్నపూర్ణ కరుణ లేకుంటే పర్సులో వున్న కాష్, లక్షలు విలువచేసే కార్డులు అన్ని వున్న ఒక్కోసారి ఆకలితో అలమటిస్తూ నిస్సహాయంగా నిలిచిపోవలిసి వస్తుంది. బ్రాహ్మణ సత్రం దగ్గరలోనే ఉంది. ఇక్కడ కూడా నిధుల కొరత తీవ్రంగా ఉన్నట్టు వుంది. డొనేషన్ రాస్తే తయారు చేస్తాం అన్నారు. సాధారణంగా 11 గంటలలోపు ముందుగా వారికి చెబితే వారు దర్శనం అయ్యేసరికి రెడీ చేస్తారు. స్వామి దయవల్ల అందరికి ఆహరం లభించింది. ఒక అబ్బాయి డబ్బులు లేవు అని అక్కడే నించున్నాడు. కానీ వాళ్ళు భోజన సదుపాయం కలిపించారు అనుకోండి. 

ఇలాంటి చోట చేసే అన్నదానం స్వామి భక్తులకు యెనలేని తృప్తిని, స్వామికి చాలా సంతోషం కలిగిస్తుంది. మీకు వీలు ఐతే ఆలయంలో గాని, ఈ సత్రంలో గాని అన్నదానం విరాళం రాయడానికి ప్రయతించగలరు. 






























Saturday, August 23, 2025

మౌన రమణ స్వామి, వేల్పూరు, తణుకు, ఆంధ్ర ప్రదేశ్.

మౌన రమణ స్వామిగా పేరు గాంచిన భగవాన్ రమణుల మార్గానునాయి. పచ్చటి పొలాల మధ్యన తణుకుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ఆశ్రమం వుంది. 

వచ్చిన అతిధులకు, పిల్లలకు ప్రసాదంగా రమణుల సాహిత్యాన్ని, చాక్లెట్లను ఎక్కడ స్వామి ప్రసాదంగా ఇవ్వటం విశేషం. 

రాత్రి 2 గంటలనుంచి ధ్యానంతో దినచర్య ప్రారంభం అవుతుంది. వచ్చిన భక్తుల ఆధ్యాత్మిక సందేహాలకు స్వామి పలక మీద సమాధానం ఇవ్వటం మరొక విశేషం.  మధ్యాహ్నం ఆశ్రమ పనులు చేసుకుంట అత్యంత నిరాడంబరంగా గోచీతో కనిపిస్తారు స్వామి. ఇక్కడ ఆశ్రమ వాతావరం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. గోదావరి జిల్లాల సమీపంలో వారు, ఆశ్రమాలు సందర్శించేవారికి ఒకసారి చూడవలసిన ఆశ్రమం.

దగ్గరలోనే అత్యంత అరుదైన బ్రహ్మసూత్ర శివాలయం తేతలి లో వుంది. అలాగే అవధూత చివటం అమ్మ గారి సమాధి కూడా తణుకు దగ్గరే తప్పక చూడండి. 

మరిన్ని వివారాలు అంతర్జాలంలో లభిస్తున్నాయి. ఇక్కడ చూడండి.

https://hithokthi.com/viewstotra.php?g_id=5&cat_id=22&story_id=12381    

అవధూత చివటం అమ్మ సమాధి నండూరి గారి మాటల్లో

https://m.youtube.com/watch?v=QeA9m_30m-Q 

తేతలి శివాలయం 

https://www.youtube.com/watch?v=pCBZklFVjkE





Sunday, September 30, 2018

'వీసా బాలాజీ' దర్శనం


ఇదేమిటి ఇలా వుంది టైటిల్ అనుకుంటున్నారా ??? (లేదు అంది మాకు తెలుసా దేని గురించి చెబుతున్నారో అంటే ఒకే :) ).

చిలుకూరు బాలాజీనే ఇపుడు మనం చెప్పుకుంటున్న వీసా బాలాజీ.

ఈ ఆర్టికల్ మొదలుపెట్టిన తరువాత జరిగిన అనేక పరిణామాలు వల్ల రెండోసారి స్వామి వారి దర్శనం జరిగింది. పరీక్షలకి లోనుకావడం కూడా జరిగింది. బహుశా ఇది ఆఖరి ఆర్టికల్ కావచ్చు.

మేము ఆదివారం మధ్యాహ్నం లంచ్ చేసి దర్శనానికి వెళ్ళాము. ౩ గంటల నుంచి ౩.౩౦ వరకు ఆలయం శుభ్రం చెయ్యటానికి ప్రదక్షిణాలు ఆపుతారు. కనుక దాన్నిబట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. శని, ఆదివారాలలో రద్దీని బట్టి భక్తుల ఆలయం వారు ప్రదక్షిణలు నియంత్రిస్తారు. కాబట్టి వచ్చేవారు దానికి తగినట్టు ప్లాన్ చేసుకోవాలి. నిన్న మా స్నేహితుడు రద్దీ తక్కువ వుంది కాబట్టి ప్రదక్షిణలు గంట నుంచి గంటన్నర లో పూర్తి చేసుకున్నాడు. అదే మాకు ఆదివారం మధ్యాహ్నం 4 గంటల పైనే (౩౦ నిమిషాలు బ్రేక్ తో సహా) పట్టింది. మాకు వచ్చేముందు ప్రదక్షిణలు భక్తులు బాగా రద్దీ ఉంటే ఆపేస్తారు అని విన్నాము కాబట్టి సోమవారం అయినా చేసుకుని మొక్కుతీర్చుకోవాలి అని ముందుగా ప్రణాళిక తో వచ్చాము. ఆ బాలాజీ దయవల్ల ఆదివారం రోజే అయిపొయింది.

బ్రాహ్మణ భోజనం లభించును అని ఆలయం వెనుక ఏర్పాటు ఉన్నట్టు తోచింది. మా సత్రం ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే వుంది. వసతి, భోజనం ఏర్పాట్లు బానే వున్నాయి.

ఆలయం బయట వాహనాలకు సదుపాయం వుంది. పార్కింగ్ పక్కనే గ్రామ దేవత ఆలయం వుంది. అది లాస్ట్ టైం వచ్చినప్పుడు తెలియదు. ఈసారి చూడటం వల్ల దర్శనం చేసుకున్నాను. కానీ ఆలయం మధ్యాహ్నం మూసివేసివుంది. అమ్మవారికి అలంకారం బాగా చేశారు.

ఆలయం లోపల సెల్ ఫోన్ కౌంటర్ వుంది. చెప్పులు పెట్టడానికి బయట ప్రైవేట్ వ్యక్తుల ఏర్పాటు కూడా కనపడింది. షాపులు వాళ్లు, బిచ్చగాళ్ల సమస్య  ఎక్కువగా వుంది. ఆలయం లోపల దర్శనం తరువాత వచ్చిన దారినే రానివ్వటం లేదు. అలా రాకూడదు అన్నారు. అందుకే బయటకు వచ్చే ద్వారం దాటగానే శివాలయం కనిపిస్తుంది. బావుంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకోండి. కొన్ని పుస్తకాల షాపులు, ఆడవారికి షాపింగ్ చేసుకోవటానికి (తక్కువ ఖర్చులో) మంచి టైం పాస్ అక్కడ షాపులు.

ఆలయ పరిరక్షణ, పూజారుల సంక్షేమం కోసం చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు వారు బానే పోరాడుతున్నారు. ఇక్కడ ఆలయం లో హుండీ కూడా ఉండదు. ఏమైనా మనం డొనేషన్ ఇస్తే ఆ మొత్తాలే నిత్య కైంకర్యాలకు వాడతారు. ప్రభుత్వం బారినపడకుండా, ఆలయ పవిత్రత కోల్పోకుండా పెద్ద యుద్ధమే చేస్తున్నట్టు వున్నారు. ఇలాంటి విషయాలలో భక్తులు అండగా ఆలయం వారికి ఉండాలి.

అభివృద్ధి మంచిదే. కానీ అది వెర్రితలలు వెయ్యకూడదు. ఆలయం ఆధ్యాత్మికతను ప్రతిభింభించాలే గాని అది విహారకేంద్రం కాకూడదు.  ఆలయ ప్రాశస్త్యం, చరిత్ర, మూలాలు, నిర్మాణాలు దెబ్బతీసే ఎటువంటి అభివృద్ధి అయినా జరగకుండా ఆస్తికులు, చరిత్రని కాపాడే నాస్తికులు కలిసిరావాలి. విజయవాడ కనకదుర్గ ఆలయం విషయంలో అవి చూసాము. పుష్కర కాలం క్రితమే ఆలాంటి కామేశ్వర అస్త్రం అన్న పేరుమీద ఆలయంలో అభివృద్ధి పేరిట జరిగిన అక్రమాలు, కట్టడాలు ఆలయ పూజారి గారు పుస్తకం విడుదల చేసారు. భక్తి అంటే కళ్ళుమూసుకుని కోరికలు కోరుకుని అదే కళ్ళుమూసుకుని అన్యాయాలను సహించటం కాదు అని నా ఉద్దేశ్యం. పోరాటం చెయ్యక పోయిన కానీసం మద్దతు తెలపటం, సహాయ సహకారాలు అందించాలి.

ఒక గుడిలో నెయ్యి దీపం నిరంతరాయంగా ఒక నెల వెలగటానికి ౨౦ గోవులను పెంచవలసి ఉంటుంది అన్న చాగంటి వారి పలుకులు వినైనా చిన్న ఆలయాల, పూజారుల కోసం సత్వర ప్రత్యేక నిధిని ఏర్పాటు చెయ్యవలసి వుంది.

సరే ఏంటో స్వామి గురించి మొదలు పెట్టడం అది ముందుకు తీసుకునివెళ్లేలోపు గడ్డు పరిస్థితులలో పునః దర్శనం జరగటం చిత్రంగా వుంది. 

 అనంత పద్మనాభస్వామివి.... అనంతమైన లీలలు. 

Sunday, July 22, 2018

అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనం & వ్రతం

బ్రహ్మాన్ని నీ కొంగుకి ముడివేసుకో. అప్పుడు నువ్వు  ఏ పని చేస్తున్నా, ఏ స్థితిలో వున్నా బ్రహ్మైక స్థితిని కలిగి ఉంటావు అన్న రామకృష్ణ పరమహంస పలుకులు మనం రామకృష్ణ పరమహంస కథామృతంలో చదువుతాము. ఆ విషయం గురించి వివరిస్తూ రామకృష్ణులు  ఏమంటారంటే... ఒక ఇంట్లో పనిచేసే పనిమనిషి ఎల్లప్పుడు ఆ ఇంటి యజమాని తాలూకు బిడ్డలను లాలిస్తూ, ఆ ఇంట్లో మిగతా పనులు చేస్తున్నా కూడా మనసెల్లపుడు ఇంట్లో వున్న తన బిడ్డల గురించిన ఆలోచన మీద ఉంటుంది. పని అయిపోగానే తన ఇంటికి చేరుకొని బిడ్డను దగ్గరకు తీసుకుని లాలించి, పాలిస్తుంది.  

భగవద్ విభూతలను, ప్రేమను, అనుగ్రహాన్ని చవిచూసిన వారెల్లరు కూడా రామకృష్ణుల బోధించిన పై విషయాన్నీ అనుభవంలో చవిచూసి ఉంటారనిపిస్తుంది. భగవంతుని గురించిన ఆలోచనలు పైనుంచి పడుతున్న నిరంతర నీటి ధార వలె ఎడతెగని ప్రవాహం వలె ప్రవహిస్తూ ఉంటాయి. చేసే వృత్తితో సంబంధం లేకుండా భగవంతుని తో అనుబంధం వున్నవాడు నిరంతరం ఏ స్థితిలో వున్నా, ఎలా వున్నా అవిచ్ఛిన్న భగవంతునితో అవినాభావ సంబంధం కలిగి ఉంటాడు.

అన్నవరం క్షేత్ర దర్శనంతో మరొకసారి స్వామి అనుభూతులు, లీలలు అనుభవంలోకి వచ్చాయి. అనంతమైన అయన లీలలు ఎంతచెప్పుకుంటే మాత్రం అవుతాయా !!! ఇంకొన్ని ఎప్పటికీ మిగిలే ఉంటాయి అన్ని విషయం తెలిసిందే కదా !!!


ఇన్ని చెప్పుకున్నాగానీ స్వామి పెట్టే పరీక్షలకి నాబోటి వాడు తట్టుకోగలడా !!! 

ప్రారంభంలో కోరికలతో అజ్ఞానంతో కూడిన ఆశ, తరువాత ఫలితాలపై వచ్చే ఆనందం, ఇలా చెయ్యకపోతే దేవుడు శిక్షిస్తాడేమోనన్న భయం, మనకెందుకులే అనుకుంటూ ఒక ప్రయత్నం చెయ్యటం, పక్కవాళ్ళు చేస్తున్నారని వారి లాగే ఎదవ ఇమిటేషన్స్ (సారీ ఇంపాక్ట్ కోసం వేసిన పదం) ఇలా ఒక్కోడి భక్తి 'లైఫ్ సైకిల్' మొదలైతే  మళ్ళీ , మళ్ళీ  వచ్చే ఫలితాలు నమ్మకాన్ని ప్రోది చేసి దృఢనమ్మకంగా మారిస్తే, భక్తిలో వచ్చే ఆటుపోట్లు మన నమ్మకాన్ని పరీక్షకు గురి చేస్తాయి. సెన్సెక్స్  లాగ మన మానసిక స్థితి బాగా ఫ్లక్త్యువేట్ అయిపోతుంటుంది ఈ దశల్లో. పరీక్ష నెగ్గిన ప్రతీసారి దృఢ నమ్మకం ఇస్తే, భవిషత్, ఎక్కడి గొంగళి అక్కడే వేసినట్టు వుండే జీవితం అది పెట్టే పరీక్షలకి భయాన్ని, విసుగు, కోపాన్ని కూడా ఇస్తాయి. భక్తిలో వచ్చే బాధ్యత భయానికి గురిచేస్తుంది. ఇవన్నీ దాటాక కొంతకాలానికి అయోమయం స్థితిలోకి వస్తాము. గుడ్డెద్దు చేలో పడినట్టు ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసే ప్రయోగాలకి ఇలా తయారవుతాడు (మన అదృష్టానికి(!) మనకి దారి చూపే గురువు కూడా ఉండడు కాబట్టి తప్పదు) :). ఇవ్వన్నీ దాటాక ప్రశాంతంగా అంటీ అంటనట్టు, ముట్టీ ముట్టనట్టు మన కర్మ (పని) మనం చేస్తూ ఉంటాము. ఇదండీ షార్ట్ గా 'భక్తి లైఫ్ సైకిల్'.  ఆ పైవాడు ఆడించే ఈ పరమపద సోపాన పటంలో ఒక్కో ఇక్కకి ఒక్కో అనుభవం. చూద్దాం పండించే వాడు ఆడిస్తున్నాడు ఏమి చేస్తాడో !!!!    

తూర్పు గోదావరి జిల్లా అంత పచ్చని పచ్చదనంతో అలరారుతూ ఉంటుంది. అన్నవరం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇంకా పట్టణీకరణ రక్కసి బారిన పడకుండా కొండల నడుమ పచ్చని వాతావరణంలో సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో అలరారుతుంది. 

అన్నవరం గుడి కి చేరుకున్నాక కొండపైకి వెళ్ళటానికి మెట్ల దారి, రోడ్ దారి వుంది. షేర్ ఆటోలు అవీ వున్నాయి. మెట్లదారి మొదట్లోనే స్వామి వారి పాదాలు వున్నాయి. అక్కడ చేతివేళ్ళతో భక్తులు కోరికలు నివేదించుకోవటం కనపడింది. మెట్లదారిలో అమ్మవార్ల గుడులు వున్నాయి. అవి దర్శించుకుని పైకి వెళ్ళాక ప్రసాదం కౌంటర్లు కనపడతాయి.

అక్కడనుంచి రెండు దార్లు కనపడతాయి. ఒక దారిలో రామచంద్ర ప్రభువు ఆలయం మొదటనే కనపడుతుంది. ఏ దారిలో అయినా కొన్ని మెట్లు ఎక్కితే ఆలయానికి చేరుకోవచ్చు. అక్కడ నుంచి మొబైల్స్ అవీ పెట్టి 'క్యూ' లైన్స్ లో ఆలయం లోపలి వెళ్ళితే స్వామి వారు మొదటి ఫ్లోర్ లో దర్శనం ఇస్తారు. అక్కడ చూసుకుని కింద ఫ్లోర్ లో యంత్రం దర్శనం ఉంటుంది. 50 రూపాయలు టికెట్ తీసుకుంటే దగ్గరకెళ్ళి అర్చన చేసుకోవచ్చు. 

ఆలయంలో గోశాల, నీడ ఆధారంగా పనిచేసే సూర్య గడియారం, పాలాభిషేకంకి మేము సిద్దంగా ఉన్నట్టు చెట్టుకింద నాగ / సుబ్రహ్మణ్య  / ఆంజనేయ స్వామి మూర్తులు మనోహరంగా దర్శనమిస్తాయి. పైన ఆలయం సమీపంలో అద్దెకు లభించే ఆలయపు గదులు 200 రూపాయల నుంచి ఉంటాయి అన్నట్టుగా తెలిసింది. ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. కనుక ఒక సారి టెంపుల్ సైట్ చూడగలరు. మేము అన్నవరం వాసవి సత్రంలో వున్నాము. మాకు ఇచ్చిన రూమ్ సరిగా లేక రాత్రి నిద్ర సరిగా పట్టలేదు. భోజనం బాగానే వుంది.

సత్యనారాయణ స్వామి అనగానే ముందుగా మన ఇళ్లలో గుర్తుకు వచ్చేది సకల శుభాలు కలిగించే స్వామి వారి వ్రతం మా పెళ్ళి అయిన తరువాత మొదటిసారి వ్రతం జరిగితే, రెండో సారి పెళ్లి మొక్కు తీర్చుకోవటం కోసం రెండవ అన్నవరంగా పేరు గాంచిన రంగాపురం లో రెండో సారి వ్రతం చేసుకోవటం జరిగింది. మళ్ళీ ముచ్చటగా మూడోసారి ఏకంగా అన్నవరంలో మూడుసారి అది కూడా పెళ్లి మొక్కుబడి లో భాగంగా జరగటం స్వామి వారి ఆపార అనుగ్రహమే కాని మనం నిమిత్తమాత్రులమే. స్వామి అనుగ్రహం ఈరూపేణ వెంట, వెంటనే దొరికింది అన్నమాట. 

ఇక వ్రతం వివరాలు & మిగతా విషయాలగురించి వస్తే...

మొదటి స్లాట్ ఉదయం ౫.౩౦ నుంచి మొదలు అవుతుంది. శ్రీకాళహస్తి వలే వ్రతానికి మండపాల బట్టి ఒక్కో రేట్ వుంది. కనీసం 200/౩౦౦ రూపాయలు టికెట్ ఒకటి తీసుకోవాలి ఒక దంపతులకి. మేము ఐతే బావుంటుంది అంటే 400 రూపాయల టికెట్ తీసుకున్నాము. బయట ఆరు కొబ్బరికాయలు, అరటిపళ్ళతో పూజ సెట్ అమ్ముతారు.  పూజకి వచ్చేటప్పుడు అది తెచ్చుకోవాలి. పసుపు, కుంకుమ వగైరాలు సరి చూసుకోండి. మేము సత్రంలో అమ్ముతున్నారు అంటే కొన్నాము గాని ఎందుచేతనో వాటిలో పసుపు మిస్ అయింది. అందుకే మీరు కొనేటప్పుడు పూజ సామాగ్రి సెట్ సరి చూసుకోండి.

పూజ మొత్తం కలిపి ఒక గంట నుంచి రెండు గంటల దాకా పడుతుంది. టికెట్ తీసుకుని మండపంలో కూర్చోవటం దగ్గర నుంచి వ్రత పరిసమాప్తి స్వామి దర్శనం అన్ని కలిపి ఒక రెండు నుంచి మూడు గంటలు పట్టవచ్చు. ఒక పూజారి గారు మైకులో వ్రత కథతో పాటు వివరాలన్నీ కూడా తెలుగు, హిందీ లో చెప్పారు. కన్నడ / తమిళ్ ఏదో ఒక భాషలో కూడా  చెప్పారో లేదో గుర్తులేదు. మీకు ఏ బాషా రాకపోతే పక్కవారిని చూసి ఫాలో అయిపోవటమే :). 

కొందరు పూజారులు బ్యాచ్ కింద వచ్చి భక్తులతో సంకల్పం అవీ చేయిస్తారు. తరువాత ప్రధాన పూజారి గారు వ్రత కథలు చెబుతారు. గణపతి పూజ, ఆవాహన, నవగ్రహ పూజ మిగతావి కూడా చేయించి సత్యనారాయణ వ్రతం మొదలుపెడతారు. వ్రతం పూర్తి అయ్యాక కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం సమర్పించాక మనకి స్వామి ప్రసాదం అందచేస్తారు. తరువాత పూజారి గారి దక్షిణతో అక్కడ నుంచి స్వామి దర్శనానికి బయలుదేరటమే . ఇది స్థూలంగా వ్రత వివరం. నాకు తెలిసింది, తోచింది చెప్పాను ఇంక మీదే లేట్. సత్యనారాయణ స్వామి పూర్తి ప్రసన్నవదనంతో, అనుగ్రహదృక్కులతో వున్నారు. మరి తొందర పండండి :).  

ఆలయం వారి వెబ్ సైట్

ఆలయం పరిసరాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. సాయంత్రం పూట కాసేపు అక్కడ స్వామి ని తలుచుకుంటూ చల్లని వాతావరణాన్ని, ఆనంద తరంగాలని అనుభూతిలోకి తెచ్చుకోండి.

తలపులమ్మ లోవ అన్నవరంకి అతి దగ్గర వున్న మరొక ప్రసిద్ధి క్షేత్రం. కొండపైన అమ్మవారు అనుగ్రహిస్తారు. అన్నవరం నుంచి ఆటోలు ఉంటాయి. షేరింగ్ కష్టం. మేము తుని రోడ్ద నుంచి లోపలి వెళ్ళాలి అక్కడ దాకా వెళ్లి ఒక గంటసేపు నిరీక్షించిన ప్రయాణికులు లేక ఆటో మాట్లాడుకుని వెళ్ళవలసి వచ్చింది. కనుక మీరు ఆలోచించుకుని అన్నవరం లో ఆటో మాట్లాడుకోవటమో లేదా అనేది పరిస్థితులనుబట్టి నిశ్చయించుకోండి.     

తలుపులమ్మ తల్లి ఆలయం వాహన పూజలకు చాలా ప్రసిద్ది. చుట్టుపక్కల జిల్లాలు వాళ్ళు , వాళ్ళ, వాళ్ళ వాహనాలు కొన్నప్పుడు సెంటిమెంట్ గా ఇక్కడే పూజ చేయిస్తారు. అమ్మ వారు వాహనాలు ప్రమాదానికి గురికాకుండా, తమను రక్షిస్తుందని ఇక్కడివారికి బాగా విశ్వాసం. 

ఆలయం, అమ్మవారి దర్శనం చాలా బావుంది, బాగా జరిగాయి. వంట చేసిపెడతాము అని లోకల్స్  ఆడవారు వచ్చే జీపులు, వాహనాల వెంటబడి అడగటం కనిపించింది. 

అక్కడ నుంచి తిరిగి అన్నవరం చేరుకొని మా యాత్ర ముగుస్తుంది అనుకునేంతలో పిఠాపురంలో శ్రీ పాద వల్లభ దర్శనం కోసం ఆగటంతో, పురుహూతికా అమ్మ వారి పూర్వాలయంతో పాటు ఊరి బైపాస్ రోడ్ దగ్గర వున్న అమ్మవారి ఆలయం, కుక్కుటేశ్వర స్వామి ఆలయం, ఇతర వుపాలయాల దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి. 

ఇక్కడ షేర్ ఆటోలు పొద్దుపోయేదాకా ఉంటాయి కనుక పెద్ద సమస్య  ఉండదు. ఏదోలా బ్రేక్ జర్నీలు చేసుకుని నెట్టుకు రావచ్చు. దాదాపు తూర్పు గోదావరి మొత్తం షేర్ ఆటో సర్వీస్ వుంది. కనుక పెద్దగా బస్సు లు గురించి ఆందోళన పడనవసరం లేదు.