Tuesday, June 24, 2014

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి & ధర్మస్థల మంజునాథుల దర్శనం

ప్రఖ్యాతి గాంచిన 3 సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి మునుపు చెప్పినట్టు మిగిలిన కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించాలి అని నా మిత్రుడు సందీప్ తో శుక్రవారం రాత్రి బయలు దేరాను అని చెప్పటం కంటే ఈశ్వరుని అనుమతి లబించింది అని చెప్పటం సబబు కాబోలు :).

అస్సలు మా ప్రయాణమే ఒక అద్భుతం, ఇంకా నిశ్చయం కాలేదు అని ఇంకా వేల్లవేమో అనుకుని ఆఫీసు లో పని చేసుకుంటూ వుంటే ఇంకో రెండున్నర గంటల వుంది అనగా చార్ట్ ప్రిపేర్ ఐంది సీట్స్ నిశ్చయం అయ్యాయి అని మెసేజ్ రాగానే నేను బన్నెరు ఘట్ట నుంచి బీటియం కి పరుగు పెడితే మా వాడు వైట్ ఫీల్డ్ నుంచి మారతహళ్లి కి పరుగుపెట్టడం అక్కడ నుంచి రైల్వే స్టేషన్ కి క్రికెట్ మ్యాచ్ లో కూడా చూడాలేమో అన్నంత ఉత్కంట, కంగారు, భయం, టెన్షన్ ఒక మనిషి కి ఎన్ని ఫీలింగ్స్ ఉండాలో అన్ని చూపించాడు తండ్రి :).

ఇక్కడో ట్విస్ట్ చెప్పాలి. యెంత వెతికి మాకు నిశ్చయం ఐన రైలు కనిపించటం లేదు టీవీ స్క్రీన్ లో. తీరా చూస్తె కన్నూర్ ఎక్ష్ప్రెస్స్ మరియు కార్వార్ ఎక్ష్ప్రెస్స్ లకి కలిపి  ఒకే జంబో రైలు వుంది. టీవీ స్క్రీన్ లో కన్నూర్ ఎక్ష్ప్రెస్స్ ట్రైన్ నెంబర్ లో రెండు ఎక్ష్ప్రెస్స్ లు కలిపి చూపిస్తున్నాయి. ఇది మొదటిసారి చూడడంతో బాగా సందిగ్దం లో పడ్డాము. తీరా బోగీలు వెతుకుంటే చివరకి పొతే అక్కడ 3ర్ద్ AC ఇక్కడ కాదు మొదటిలోనే అనే చెప్పటం తో
మళ్లీ వత్తిడికి లోనయ్యాము. మేము వెళ్ళింది కరెక్ట్ అని వెంటనే గమనించటంతో ఊపిరి పీల్చుకుని ఆ రాత్రికి ప్రయాణం సాగించాము. ప్రొద్దునే 6 కల్లా సుబ్రహ్మణ్య రోడ్ కి రైలు సమయానికి చేరుకుంది.

సుబ్రమణ్య పురం రోడ్ స్టేషన్ ఫోటోలు చూడగలరు.









అక్కడ చాల టాక్షీలు, జీపులు వున్నాయి షేరింగ్ లో వెళ్ళవచ్చు. దారి అడవి మధ్యలో వంపులు తిరుగుతూ వెళుతున్నట్టు వుంది. వెళ్ళే దారిలోనే కుమారా తీర్ధం వుంది. అక్కడ ఆగేవాళ్ళు దిగిపోయారు. మేము దిగుదామనుకుని పెద్దగా తెలియకపోవటం వల్లనా, సౌకర్యాల శంకతో ఆగలేదు. ముందు దేవుడి దర్శనం పరమావధిగా వుంటుంది ఏమో కొందరికి :). కుమారా తీర్థానికి చాలా పురాతన చరిత్ర వుంది. దేవస్తానంలో అమ్మే పుస్తకంలో వుంది. వాసుకి కి, గరుత్మంతునికి, కుమ్మే సుబ్రమణ్య పేరు నామాంతరానికి ఇలా అన్ని విషయాలకి వున్నా సంబందాల గురించి తెలియపరుస్తూ విశదంగా వుంది. తెలుగు పుస్తకం లేకపోవటం వల్లనా ఇంగ్లీష్ కొన్నాము.

ఇంకా టెంపుల్ దగ్గర ఆలయం సదనం లో ఖాళీ లేకపోవటం వల్లనా ఒక లాడ్జీ (సాధనా 08257-281291) లో దిగాము. 300 రూపాయలు చెప్పినట్టు గుర్తు. స్నాదులు పూర్తి చేసుకుని దర్శనానికి వెళ్ళాము. దర్శనం బాగా జరిగింది. ఇక్కడ గమనించ వలసిన ఒక విషయం ఏమిటి అంటే మగవాళ్ళందరూ చొక్కా, బనీను తీసివేసి దర్శనం కి వెళ్ళాలి. ఆలయం లోపల అన్ని గుడులు అయిన తరువాత వేసుకోవాలి. కొందరు పంచె మీద వచ్చారు. చాల బాగా దర్శనం జరిగింది.

బయటకు వచ్చిన తరువాత ఆది సుబ్రహ్మణ్య అని వేరొక టెంపుల్ కూడా వుంది పక్కనే. అది తప్పని సరిగా దర్శనం చేసుకోండి. అక్కడ ఒక పుట్ట లో వున్నట్టు వుంటుంది.

ఇక్కడ గమనించిన విషయం ఏమిటి అంటే చాల మంది ని చూసిన వెంటనే వారి శరీర వర్ణం, కళ్ళ రంగు, ఇతర విషయాలు పరిశీలిస్తే చాల మంది గ్రహ దోషాలుతో బాధ పడుతున్నట్టు మనసుకి తోచింది. ఐనా జాతక, సర్ప దోషాలు వీటికి పేరుగాంచిన ఆలయమే కాబట్టి విడ్డూరమైన విషయం కాదు ఏమో !.

అక్కడ నుంచి ధర్మస్థల మంజునాథుని దర్శించాలని బయలుదేరాము. పచ్చని వాతావరణం, అడవి మొత్తం ప్రయాణం అంత మాతోనే వుంది అనిపించింది.

బయట కాళ్ళు కడుగుకొనుటకు ఎక్కడ పంపు కనిపించలేదు. ధర్మస్తల ఆలయం లో మగవాళ్ళు విధిగా చొక్కా, బనీను తీసివేసి మంజునాథుని దర్శించాలీ. ఎవరికి మినహాయింపు లేదు. మన తిరుపతిలాగా మెస్సలు వున్నాయి. ప్రొద్దున 11:00 నుంచి 12:00 కి విరామం. అప్పుడు లైన్ ఆపుతారు. దర్శనం బాగా జరిగింది. ఆలయం లోనే భోజన ప్రసాదం చేసాము. రెండు మూరుసార్లు మారు వస్తుంది. ఎవరు వదిలివేయ్యకుండా మంచి ఏర్పాటు.










A Hotel


ఇక అక్కడితో బాగా అలసిపోయవేమో ఇంకా బయలు దేరదాం అని బస్సు పట్టుకుని బెంగళూరు కి వచ్చేసాము.