ఇదేమిటి ఇలా వుంది టైటిల్ అనుకుంటున్నారా ??? (లేదు అంది మాకు తెలుసా దేని గురించి చెబుతున్నారో అంటే ఒకే :) ).
చిలుకూరు బాలాజీనే ఇపుడు మనం చెప్పుకుంటున్న వీసా బాలాజీ.
ఈ ఆర్టికల్ మొదలుపెట్టిన తరువాత జరిగిన అనేక పరిణామాలు వల్ల రెండోసారి స్వామి వారి దర్శనం జరిగింది. పరీక్షలకి లోనుకావడం కూడా జరిగింది. బహుశా ఇది ఆఖరి ఆర్టికల్ కావచ్చు.
మేము ఆదివారం మధ్యాహ్నం లంచ్ చేసి దర్శనానికి వెళ్ళాము. ౩ గంటల నుంచి ౩.౩౦ వరకు ఆలయం శుభ్రం చెయ్యటానికి ప్రదక్షిణాలు ఆపుతారు. కనుక దాన్నిబట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. శని, ఆదివారాలలో రద్దీని బట్టి భక్తుల ఆలయం వారు ప్రదక్షిణలు నియంత్రిస్తారు. కాబట్టి వచ్చేవారు దానికి తగినట్టు ప్లాన్ చేసుకోవాలి. నిన్న మా స్నేహితుడు రద్దీ తక్కువ వుంది కాబట్టి ప్రదక్షిణలు గంట నుంచి గంటన్నర లో పూర్తి చేసుకున్నాడు. అదే మాకు ఆదివారం మధ్యాహ్నం 4 గంటల పైనే (౩౦ నిమిషాలు బ్రేక్ తో సహా) పట్టింది. మాకు వచ్చేముందు ప్రదక్షిణలు భక్తులు బాగా రద్దీ ఉంటే ఆపేస్తారు అని విన్నాము కాబట్టి సోమవారం అయినా చేసుకుని మొక్కుతీర్చుకోవాలి అని ముందుగా ప్రణాళిక తో వచ్చాము. ఆ బాలాజీ దయవల్ల ఆదివారం రోజే అయిపొయింది.
బ్రాహ్మణ భోజనం లభించును అని ఆలయం వెనుక ఏర్పాటు ఉన్నట్టు తోచింది. మా సత్రం ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే వుంది. వసతి, భోజనం ఏర్పాట్లు బానే వున్నాయి.
ఆలయం బయట వాహనాలకు సదుపాయం వుంది. పార్కింగ్ పక్కనే గ్రామ దేవత ఆలయం వుంది. అది లాస్ట్ టైం వచ్చినప్పుడు తెలియదు. ఈసారి చూడటం వల్ల దర్శనం చేసుకున్నాను. కానీ ఆలయం మధ్యాహ్నం మూసివేసివుంది. అమ్మవారికి అలంకారం బాగా చేశారు.
ఆలయం లోపల సెల్ ఫోన్ కౌంటర్ వుంది. చెప్పులు పెట్టడానికి బయట ప్రైవేట్ వ్యక్తుల ఏర్పాటు కూడా కనపడింది. షాపులు వాళ్లు, బిచ్చగాళ్ల సమస్య ఎక్కువగా వుంది. ఆలయం లోపల దర్శనం తరువాత వచ్చిన దారినే రానివ్వటం లేదు. అలా రాకూడదు అన్నారు. అందుకే బయటకు వచ్చే ద్వారం దాటగానే శివాలయం కనిపిస్తుంది. బావుంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకోండి. కొన్ని పుస్తకాల షాపులు, ఆడవారికి షాపింగ్ చేసుకోవటానికి (తక్కువ ఖర్చులో) మంచి టైం పాస్ అక్కడ షాపులు.
ఆలయ పరిరక్షణ, పూజారుల సంక్షేమం కోసం చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు వారు బానే పోరాడుతున్నారు. ఇక్కడ ఆలయం లో హుండీ కూడా ఉండదు. ఏమైనా మనం డొనేషన్ ఇస్తే ఆ మొత్తాలే నిత్య కైంకర్యాలకు వాడతారు. ప్రభుత్వం బారినపడకుండా, ఆలయ పవిత్రత కోల్పోకుండా పెద్ద యుద్ధమే చేస్తున్నట్టు వున్నారు. ఇలాంటి విషయాలలో భక్తులు అండగా ఆలయం వారికి ఉండాలి.
అభివృద్ధి మంచిదే. కానీ అది వెర్రితలలు వెయ్యకూడదు. ఆలయం ఆధ్యాత్మికతను ప్రతిభింభించాలే గాని అది విహారకేంద్రం కాకూడదు. ఆలయ ప్రాశస్త్యం, చరిత్ర, మూలాలు, నిర్మాణాలు దెబ్బతీసే ఎటువంటి అభివృద్ధి అయినా జరగకుండా ఆస్తికులు, చరిత్రని కాపాడే నాస్తికులు కలిసిరావాలి. విజయవాడ కనకదుర్గ ఆలయం విషయంలో అవి చూసాము. పుష్కర కాలం క్రితమే ఆలాంటి కామేశ్వర అస్త్రం అన్న పేరుమీద ఆలయంలో అభివృద్ధి పేరిట జరిగిన అక్రమాలు, కట్టడాలు ఆలయ పూజారి గారు పుస్తకం విడుదల చేసారు. భక్తి అంటే కళ్ళుమూసుకుని కోరికలు కోరుకుని అదే కళ్ళుమూసుకుని అన్యాయాలను సహించటం కాదు అని నా ఉద్దేశ్యం. పోరాటం చెయ్యక పోయిన కానీసం మద్దతు తెలపటం, సహాయ సహకారాలు అందించాలి.
ఒక గుడిలో నెయ్యి దీపం నిరంతరాయంగా ఒక నెల వెలగటానికి ౨౦ గోవులను పెంచవలసి ఉంటుంది అన్న చాగంటి వారి పలుకులు వినైనా చిన్న ఆలయాల, పూజారుల కోసం సత్వర ప్రత్యేక నిధిని ఏర్పాటు చెయ్యవలసి వుంది.
సరే ఏంటో స్వామి గురించి మొదలు పెట్టడం అది ముందుకు తీసుకునివెళ్లేలోపు గడ్డు పరిస్థితులలో పునః దర్శనం జరగటం చిత్రంగా వుంది.
అనంత పద్మనాభస్వామివి.... అనంతమైన లీలలు.
No comments:
Post a Comment