Sunday, April 1, 2018

శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పిన వివాహం వైభవం ప్రవచనంలో నేను కొన్ని పాయింట్లు నాకోసం నోట్ చేసుకున్నా, మీకెవరికైనా ఉపయోగపడతాయేమో చూసుకోండి.


* part 1 12:౦౦ కన్యాదానం సమయంలో పెళ్ళికొడుకు అంగీకారం తెలుపుతూ "ఓం స్వస్తి"  అనాలి.

* part 2 17:00 వధువుతో శచీదేవి శ్లోకాలు , గౌరీ తపస్సు  వరకు చేపిస్తే జీవితంలో వైధవ్యం రాసి వున్నా శచీదేవి అడ్డుపడుతుంది.

part ౩ 18:00 పుట్టమన్ను / పాలికలు కన్యాదాత విధులు వివరణ.   

* part 2 20:00 గోళ్లతీత సంబరంలో సువాసినులు గంధం తీస్తే, తండ్రి వరస వారు మూడు నిలువు  చారికలు గోళ్లు తగలకుండా వేళ్లతో పెళ్ళికొడుకుపై గీస్తారు. అవి ఆరిన తరువాత తల స్నానం (మంగళ స్నానం) చేపిస్తారు. (బ్రాహ్మణేతరులు ఐతే అఱివేడు కుండలతో స్నానం). బాసికం కట్టాలంటే శైవారాధకులు (శివ భక్తులు కట్టాలి ఎందుకంటె విష్ణువు అల్లుడుగా చూస్తారు). 

* part 2 28:00 గొడుగు & చెప్పులు. గొడుగు & చెప్పులు బ్రహ్మ  స్థానంలో  వున్న వారికి దానం ఇవ్వాలి. పెళ్లికొడుకికి తరువాత ఇచ్చినా దోషం లేదు (రెండు జతలు కావాలి గొడుగు & చెప్పులు). 

* part 2 36:00 part 2 పెళ్ళికొడుకు తూరుపు దిక్కుగా బయలుదేరాలి, రాజద్వారం  దాటేటప్పుడు జ్యోతులు పట్టుకుని సువాసినీలు ఎదురు రావాలి. వారి తరువాత్త  నీటి  కుండలతో  వదిన  అక్క  వరసవాళ్లు  ఎదురు  రావాలి  అప్పుడు  పెళ్లి  కొడుకు  రాజద్వారం  దాటతాడు . తరువాత  ఎదుర్కోలు ఉత్సవం  అత్తగారు  తేనెతో లేదా  పానకంతో  ఎదురువస్తారు. అత్తగారు ఒక చిన్న గ్లాస్ తో  అల్లుడికి  ఇచ్చి  తాగమంటుంది.

* part 2: 45:59 గౌరీ  పూజలో  పార్వతి  పరమేశ్వరుల మూర్తి కి  పూజ  చేసుకోవాలి.  ఒక్క   అమ్మవారి కాదు . బుట్టలో  కూర్చుని  గౌరీ  పూజ  చేసుకోవాలి.  పీటల మీద  కూర్చుకుని  కాదు .

* part 3: 01:00 మేనమామ  మాత్రమే  బుట్టలో  పెళ్లికూతురిని  తీసుకెళ్లాలి . మేనమామ  లేకపోతె , మేనమామ  వరసైన  వాళ్ళు మాత్రమే  తీసుకెళ్లాలి . పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు మధ్యలో  తెర పెడతారు  ఆ  తెర శచీ దేవి.

బూట్లతో  / చెప్పులతో  వేదిక  మీదకి ఎవరు రాకూడదు. ఫోటోగ్రాఫర్ తో  సహా, ఎందుకంటె వేదమంత్రాలతో దేవతలు వస్తారు కాబట్టి. 

* part 3 10:30 పెళ్ళికొడుకు దర్భతో  మంత్రం  చెప్పి  నీట  ముంచి  పెళ్లికూతురు నొసటి  మీద పైకి తుడుస్తాడు.

* part 3 15:00 అత్తా మామలు  "కంద"  (ఒక  బుట్టతో  పూలు  & మరొక  బుట్టతో  పళ్ళు) తీసుకెళ్లాలి.  దానితో పెళ్లికూతురు గౌరీ పూజ చేసుకోవాలి.

* 18:00 కన్యాదాత  కొత్త  దర్భాసనం  కొనాలి.  వేదిక  మీదకి  వచ్చాక  పెళ్లి  కొడుక్కి  ఆసనం  వేయాలి  (వచ్చేది  విష్ణువు  అని  వేద  మంత్రాలు చెబుతున్నాయి).

* part 5 04:00 తెర  (శచీ  దేవి ) మీద  రాతలు  రాయకూడదు. తెర సువాసన భరితంగా ఉండి తీరాలి . గంధం రాయాలి . పసుపు  పెట్టాలి , అలాగే  పరిమళ ద్రవ్యాలు అదమాలి. రెండు  స్వస్తిక్  మర్క్స్  మధ్యలో  శ్రీకారం  రాయాలి . తరువాత  పెద్దలెవరైనా  పట్టుకుంటారు  అటు  ఒకరు  ఇటు  ఒకరు. మెల్లిగా దించుతారు తరువాత.

part 5 13:00 పళ్లెంలో కాళ్ళు  కడిగేటప్పుడు ముందు  కుడికాలు  పెట్టాలి. తరువాత  ఎడమ  కాలు  పెట్టాలి. 

part 5 14:00 మయీ  మయీమ్  మంత్రం  మామ  గారు  కాళ్ళు  కడుగుకొనేటప్పుడు  తేజస్సు  పోకుండా పెళ్లి కొడుకు చెబుతుండాలి తెలియకపోతే పేపర్ పై రాసుకుని చెప్పుకోవాలి.
(మయీ మయీమ్ మహా మయీమ్  యశో మయీమ్  ఇంద్రియం వీర్యం ) 

part 5 14:35 కన్యాదానం లో  అమ్మాయిని  పుచ్చుకుంటావా అన్నపుడు ఓం  స్వస్తి  పెళ్ళికొడుకు  అనాలి  (మీరు  అన్నది  నిజమగుగాక అని అర్థం).

part 5 16:50 సంప్రదదతే  తుభ్యం నమః  అని  పురోహితుడు  అన్నా కానీ మనం  ఇది మాములు దానం కాదు కాబట్టి ప్రతిపాదయామి అని వారికి చెప్పవలెను  - సంప్రదదతే ( (మామూలు దానం కాదు కాబట్టి తృతీయ విభక్తి వెయ్యకూడదు) అని కన్యాదాత  అనకూడదు . "ప్రతిపాదయామి" అని  చెప్పాలి. పురోహితుడు ఆలా చెప్పకపోతే  "ప్రతిపాదయామి"  అని  ముమ్మారు  కన్యాదాత  మనసులో అనుకుంటే సరిపోతుంది.

part 5 19:23 పెళ్లికూతురు పట్టుకునే కొబ్బరి బొండం మీద పేర్లు  / పెయింట్స్  రాయటం, సూదులు  గుచ్చటం  చెయ్యకూడదు. ఎందుకంటే అది పార్వతి పరమేశ్వర స్వరూపం. కొబ్బరిబోండం  / గంధపు  చెక్క  / గుమ్మడి తో  పెళ్లికూతురు చేతిలో  పట్టుకుని బుట్టలో కూర్చుకుంటుంది.

మహాసంకల్పం జాగ్రత్తగా వినాలి సభికులందురు.

జీలకర్ర  బెల్లం  కొద్దిసేపు  ముందు  మాత్రమే  తయారుచేయాలి

part 5 29:30 డోలు  సన్నాయి  మాత్రమే  మంగళ ధ్వని వాయిద్యాలు .

part 5 36:00 అత్తగారు  ఆవు  పెరుగు , నెయ్యి , కొత్త  సీసా  పుట్ట  తేనే  తో కలిపి పెడతారు. ఇది మధుపర్కం  అంటారు. 

part 6 ఫోమ్  / నురుగు  చల్లుకోకూడదు ( ఇంద్రుని బ్రహ్మహత్యా పాతకం తొలగించుకోవడానికి ఒక భాగం నురగలో ప్రవేశపెట్టాడు కాబట్టి).

part 6 13:00 6 యుగాచిద్రాభిషేకం  చేస్తారు  ... తరువాత  పెళ్ళికొడుకు  దర్భతో  పెళ్లి కూతురు లలాటం పైకి తుడుస్తాడు అందుచేత భవిష్యత్ లో ఏమైనా వైధవ్య యోగాలుంటే పోతాయి.   

part 6 అక్షతలు వెన్ను విరగని బియ్యము వాడాలి . వేదిక  మీద  కుర్చీలు  వేయించకుండా  ఉండాలి. ఎందుకంటె వేదమంత్రాలతో ఇంద్రాణి దేవతలు వస్తారు .

part 6 22:00 కపిలవచనము  (తలంబ్రాలు ) తడిపి  ఆరబెట్టినా  బియ్యం  మాత్రమే  వాడాలి తలంబ్రాలకి  మారె  ప్లాస్టిక్  / పదార్దాలు  వాడకూడదు. ఒకసారి పోసుకున్నపుడు సంతానం, ఒకసారి  పోసుకున్నాడు  పాడిపంటలు  ఒకసారి  పోసుకున్నాడు  ధన  సమృద్ధి,  ఆఖరున  ఆడపిల్ల అంటుంది మనకి త్యాగం లభించుగాక అని. మిగిలిన  తలంబ్రాలు  ఆమంత్రకంగా  పోసుకుంటారు.

part 6 27:00 పెళ్ళికొడుకు  మంత్రంతో (నేను చూసినటువంటి ఈ నిరీక్షణ సుముహూర్తు అనుగ్రహం అనుగృహాణంన్తు - సుముహూర్తం గురించి సభలో అరవాలి. సభికులందరు చెప్పులుదీసి "ఇతి సుముహూర్తోస్తు" అని అనాలి. 

part 6 28:42 సభలోని పెద్దలకి   కన్యాదాత చందనం రాయాలి. కన్యాదాత లేకపోతే కన్యాదాత  అన్నదమ్ములు గాని రాయాలి. ఆడవారు ఆడవారికి  రాయాలి .

పచ్చ అన్నం  అమ్మవారి  అనుగ్రహం  కాబట్టి  తప్పనిసరిగా పులిహోర  & బూరె వేస్తె విందు (మృష్టాన్న భోజనం) పూర్తయ్యి నట్టే