బ్రహ్మాన్ని నీ కొంగుకి ముడివేసుకో. అప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ స్థితిలో వున్నా బ్రహ్మైక స్థితిని కలిగి ఉంటావు అన్న రామకృష్ణ పరమహంస పలుకులు మనం రామకృష్ణ పరమహంస కథామృతంలో చదువుతాము. ఆ విషయం గురించి వివరిస్తూ రామకృష్ణులు ఏమంటారంటే... ఒక ఇంట్లో పనిచేసే పనిమనిషి ఎల్లప్పుడు ఆ ఇంటి యజమాని తాలూకు బిడ్డలను లాలిస్తూ, ఆ ఇంట్లో మిగతా పనులు చేస్తున్నా కూడా మనసెల్లపుడు ఇంట్లో వున్న తన బిడ్డల గురించిన ఆలోచన మీద ఉంటుంది. పని అయిపోగానే తన ఇంటికి చేరుకొని బిడ్డను దగ్గరకు తీసుకుని లాలించి, పాలిస్తుంది.
భగవద్ విభూతలను, ప్రేమను, అనుగ్రహాన్ని చవిచూసిన వారెల్లరు కూడా రామకృష్ణుల బోధించిన పై విషయాన్నీ అనుభవంలో చవిచూసి ఉంటారనిపిస్తుంది. భగవంతుని గురించిన ఆలోచనలు పైనుంచి పడుతున్న నిరంతర నీటి ధార వలె ఎడతెగని ప్రవాహం వలె ప్రవహిస్తూ ఉంటాయి. చేసే వృత్తితో సంబంధం లేకుండా భగవంతుని తో అనుబంధం వున్నవాడు నిరంతరం ఏ స్థితిలో వున్నా, ఎలా వున్నా అవిచ్ఛిన్న భగవంతునితో అవినాభావ సంబంధం కలిగి ఉంటాడు.
అన్నవరం క్షేత్ర దర్శనంతో మరొకసారి స్వామి అనుభూతులు, లీలలు అనుభవంలోకి వచ్చాయి. అనంతమైన అయన లీలలు ఎంతచెప్పుకుంటే మాత్రం అవుతాయా !!! ఇంకొన్ని ఎప్పటికీ మిగిలే ఉంటాయి అన్ని విషయం తెలిసిందే కదా !!!
ఇన్ని చెప్పుకున్నాగానీ స్వామి పెట్టే పరీక్షలకి నాబోటి వాడు తట్టుకోగలడా !!!
ప్రారంభంలో కోరికలతో అజ్ఞానంతో కూడిన ఆశ, తరువాత ఫలితాలపై వచ్చే ఆనందం, ఇలా చెయ్యకపోతే దేవుడు శిక్షిస్తాడేమోనన్న భయం, మనకెందుకులే అనుకుంటూ ఒక ప్రయత్నం చెయ్యటం, పక్కవాళ్ళు చేస్తున్నారని వారి లాగే ఎదవ ఇమిటేషన్స్ (సారీ ఇంపాక్ట్ కోసం వేసిన పదం) ఇలా ఒక్కోడి భక్తి 'లైఫ్ సైకిల్' మొదలైతే మళ్ళీ , మళ్ళీ వచ్చే ఫలితాలు నమ్మకాన్ని ప్రోది చేసి దృఢనమ్మకంగా మారిస్తే, భక్తిలో వచ్చే ఆటుపోట్లు మన నమ్మకాన్ని పరీక్షకు గురి చేస్తాయి. సెన్సెక్స్ లాగ మన మానసిక స్థితి బాగా ఫ్లక్త్యువేట్ అయిపోతుంటుంది ఈ దశల్లో. పరీక్ష నెగ్గిన ప్రతీసారి దృఢ నమ్మకం ఇస్తే, భవిషత్, ఎక్కడి గొంగళి అక్కడే వేసినట్టు వుండే జీవితం అది పెట్టే పరీక్షలకి భయాన్ని, విసుగు, కోపాన్ని కూడా ఇస్తాయి. భక్తిలో వచ్చే బాధ్యత భయానికి గురిచేస్తుంది. ఇవన్నీ దాటాక కొంతకాలానికి అయోమయం స్థితిలోకి వస్తాము. గుడ్డెద్దు చేలో పడినట్టు ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసే ప్రయోగాలకి ఇలా తయారవుతాడు (మన అదృష్టానికి(!) మనకి దారి చూపే గురువు కూడా ఉండడు కాబట్టి తప్పదు) :). ఇవ్వన్నీ దాటాక ప్రశాంతంగా అంటీ అంటనట్టు, ముట్టీ ముట్టనట్టు మన కర్మ (పని) మనం చేస్తూ ఉంటాము. ఇదండీ షార్ట్ గా 'భక్తి లైఫ్ సైకిల్'. ఆ పైవాడు ఆడించే ఈ పరమపద సోపాన పటంలో ఒక్కో ఇక్కకి ఒక్కో అనుభవం. చూద్దాం పండించే వాడు ఆడిస్తున్నాడు ఏమి చేస్తాడో !!!!
తూర్పు గోదావరి జిల్లా అంత పచ్చని పచ్చదనంతో అలరారుతూ ఉంటుంది. అన్నవరం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇంకా పట్టణీకరణ రక్కసి బారిన పడకుండా కొండల నడుమ పచ్చని వాతావరణంలో సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో అలరారుతుంది.
అన్నవరం గుడి కి చేరుకున్నాక కొండపైకి వెళ్ళటానికి మెట్ల దారి, రోడ్ దారి వుంది. షేర్ ఆటోలు అవీ వున్నాయి. మెట్లదారి మొదట్లోనే స్వామి వారి పాదాలు వున్నాయి. అక్కడ చేతివేళ్ళతో భక్తులు కోరికలు నివేదించుకోవటం కనపడింది. మెట్లదారిలో అమ్మవార్ల గుడులు వున్నాయి. అవి దర్శించుకుని పైకి వెళ్ళాక ప్రసాదం కౌంటర్లు కనపడతాయి.
అక్కడనుంచి రెండు దార్లు కనపడతాయి. ఒక దారిలో రామచంద్ర ప్రభువు ఆలయం మొదటనే కనపడుతుంది. ఏ దారిలో అయినా కొన్ని మెట్లు ఎక్కితే ఆలయానికి చేరుకోవచ్చు. అక్కడ నుంచి మొబైల్స్ అవీ పెట్టి 'క్యూ' లైన్స్ లో ఆలయం లోపలి వెళ్ళితే స్వామి వారు మొదటి ఫ్లోర్ లో దర్శనం ఇస్తారు. అక్కడ చూసుకుని కింద ఫ్లోర్ లో యంత్రం దర్శనం ఉంటుంది. 50 రూపాయలు టికెట్ తీసుకుంటే దగ్గరకెళ్ళి అర్చన చేసుకోవచ్చు.
ఆలయంలో గోశాల, నీడ ఆధారంగా పనిచేసే సూర్య గడియారం, పాలాభిషేకంకి మేము సిద్దంగా ఉన్నట్టు చెట్టుకింద నాగ / సుబ్రహ్మణ్య / ఆంజనేయ స్వామి మూర్తులు మనోహరంగా దర్శనమిస్తాయి. పైన ఆలయం సమీపంలో అద్దెకు లభించే ఆలయపు గదులు 200 రూపాయల నుంచి ఉంటాయి అన్నట్టుగా తెలిసింది. ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. కనుక ఒక సారి టెంపుల్ సైట్ చూడగలరు. మేము అన్నవరం వాసవి సత్రంలో వున్నాము. మాకు ఇచ్చిన రూమ్ సరిగా లేక రాత్రి నిద్ర సరిగా పట్టలేదు. భోజనం బాగానే వుంది.
సత్యనారాయణ స్వామి అనగానే ముందుగా మన ఇళ్లలో గుర్తుకు వచ్చేది సకల శుభాలు కలిగించే స్వామి వారి వ్రతం మా పెళ్ళి అయిన తరువాత మొదటిసారి వ్రతం జరిగితే, రెండో సారి పెళ్లి మొక్కు తీర్చుకోవటం కోసం రెండవ అన్నవరంగా పేరు గాంచిన రంగాపురం లో రెండో సారి వ్రతం చేసుకోవటం జరిగింది. మళ్ళీ ముచ్చటగా మూడోసారి ఏకంగా అన్నవరంలో మూడుసారి అది కూడా పెళ్లి మొక్కుబడి లో భాగంగా జరగటం స్వామి వారి ఆపార అనుగ్రహమే కాని మనం నిమిత్తమాత్రులమే. స్వామి అనుగ్రహం ఈరూపేణ వెంట, వెంటనే దొరికింది అన్నమాట.
ఇక వ్రతం వివరాలు & మిగతా విషయాలగురించి వస్తే...
మొదటి స్లాట్ ఉదయం ౫.౩౦ నుంచి మొదలు అవుతుంది. శ్రీకాళహస్తి వలే వ్రతానికి మండపాల బట్టి ఒక్కో రేట్ వుంది. కనీసం 200/౩౦౦ రూపాయలు టికెట్ ఒకటి తీసుకోవాలి ఒక దంపతులకి. మేము ఐతే బావుంటుంది అంటే 400 రూపాయల టికెట్ తీసుకున్నాము. బయట ఆరు కొబ్బరికాయలు, అరటిపళ్ళతో పూజ సెట్ అమ్ముతారు. పూజకి వచ్చేటప్పుడు అది తెచ్చుకోవాలి. పసుపు, కుంకుమ వగైరాలు సరి చూసుకోండి. మేము సత్రంలో అమ్ముతున్నారు అంటే కొన్నాము గాని ఎందుచేతనో వాటిలో పసుపు మిస్ అయింది. అందుకే మీరు కొనేటప్పుడు పూజ సామాగ్రి సెట్ సరి చూసుకోండి.
పూజ మొత్తం కలిపి ఒక గంట నుంచి రెండు గంటల దాకా పడుతుంది. టికెట్ తీసుకుని మండపంలో కూర్చోవటం దగ్గర నుంచి వ్రత పరిసమాప్తి స్వామి దర్శనం అన్ని కలిపి ఒక రెండు నుంచి మూడు గంటలు పట్టవచ్చు. ఒక పూజారి గారు మైకులో వ్రత కథతో పాటు వివరాలన్నీ కూడా తెలుగు, హిందీ లో చెప్పారు. కన్నడ / తమిళ్ ఏదో ఒక భాషలో కూడా చెప్పారో లేదో గుర్తులేదు. మీకు ఏ బాషా రాకపోతే పక్కవారిని చూసి ఫాలో అయిపోవటమే :).
కొందరు పూజారులు బ్యాచ్ కింద వచ్చి భక్తులతో సంకల్పం అవీ చేయిస్తారు. తరువాత ప్రధాన పూజారి గారు వ్రత కథలు చెబుతారు. గణపతి పూజ, ఆవాహన, నవగ్రహ పూజ మిగతావి కూడా చేయించి సత్యనారాయణ వ్రతం మొదలుపెడతారు. వ్రతం పూర్తి అయ్యాక కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం సమర్పించాక మనకి స్వామి ప్రసాదం అందచేస్తారు. తరువాత పూజారి గారి దక్షిణతో అక్కడ నుంచి స్వామి దర్శనానికి బయలుదేరటమే . ఇది స్థూలంగా వ్రత వివరం. నాకు తెలిసింది, తోచింది చెప్పాను ఇంక మీదే లేట్. సత్యనారాయణ స్వామి పూర్తి ప్రసన్నవదనంతో, అనుగ్రహదృక్కులతో వున్నారు. మరి తొందర పండండి :).
ఆలయం వారి వెబ్ సైట్
ఆలయం పరిసరాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. సాయంత్రం పూట కాసేపు అక్కడ స్వామి ని తలుచుకుంటూ చల్లని వాతావరణాన్ని, ఆనంద తరంగాలని అనుభూతిలోకి తెచ్చుకోండి.
తలపులమ్మ లోవ అన్నవరంకి అతి దగ్గర వున్న మరొక ప్రసిద్ధి క్షేత్రం. కొండపైన అమ్మవారు అనుగ్రహిస్తారు. అన్నవరం నుంచి ఆటోలు ఉంటాయి. షేరింగ్ కష్టం. మేము తుని రోడ్ద నుంచి లోపలి వెళ్ళాలి అక్కడ దాకా వెళ్లి ఒక గంటసేపు నిరీక్షించిన ప్రయాణికులు లేక ఆటో మాట్లాడుకుని వెళ్ళవలసి వచ్చింది. కనుక మీరు ఆలోచించుకుని అన్నవరం లో ఆటో మాట్లాడుకోవటమో లేదా అనేది పరిస్థితులనుబట్టి నిశ్చయించుకోండి.
తలుపులమ్మ తల్లి ఆలయం వాహన పూజలకు చాలా ప్రసిద్ది. చుట్టుపక్కల జిల్లాలు వాళ్ళు , వాళ్ళ, వాళ్ళ వాహనాలు కొన్నప్పుడు సెంటిమెంట్ గా ఇక్కడే పూజ చేయిస్తారు. అమ్మ వారు వాహనాలు ప్రమాదానికి గురికాకుండా, తమను రక్షిస్తుందని ఇక్కడివారికి బాగా విశ్వాసం.
ఆలయం, అమ్మవారి దర్శనం చాలా బావుంది, బాగా జరిగాయి. వంట చేసిపెడతాము అని లోకల్స్ ఆడవారు వచ్చే జీపులు, వాహనాల వెంటబడి అడగటం కనిపించింది.
అక్కడ నుంచి తిరిగి అన్నవరం చేరుకొని మా యాత్ర ముగుస్తుంది అనుకునేంతలో పిఠాపురంలో శ్రీ పాద వల్లభ దర్శనం కోసం ఆగటంతో, పురుహూతికా అమ్మ వారి పూర్వాలయంతో పాటు ఊరి బైపాస్ రోడ్ దగ్గర వున్న అమ్మవారి ఆలయం, కుక్కుటేశ్వర స్వామి ఆలయం, ఇతర వుపాలయాల దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి.
ఇక్కడ షేర్ ఆటోలు పొద్దుపోయేదాకా ఉంటాయి కనుక పెద్ద సమస్య ఉండదు. ఏదోలా బ్రేక్ జర్నీలు చేసుకుని నెట్టుకు రావచ్చు. దాదాపు తూర్పు గోదావరి మొత్తం షేర్ ఆటో సర్వీస్ వుంది. కనుక పెద్దగా బస్సు లు గురించి ఆందోళన పడనవసరం లేదు.
భగవద్ విభూతలను, ప్రేమను, అనుగ్రహాన్ని చవిచూసిన వారెల్లరు కూడా రామకృష్ణుల బోధించిన పై విషయాన్నీ అనుభవంలో చవిచూసి ఉంటారనిపిస్తుంది. భగవంతుని గురించిన ఆలోచనలు పైనుంచి పడుతున్న నిరంతర నీటి ధార వలె ఎడతెగని ప్రవాహం వలె ప్రవహిస్తూ ఉంటాయి. చేసే వృత్తితో సంబంధం లేకుండా భగవంతుని తో అనుబంధం వున్నవాడు నిరంతరం ఏ స్థితిలో వున్నా, ఎలా వున్నా అవిచ్ఛిన్న భగవంతునితో అవినాభావ సంబంధం కలిగి ఉంటాడు.
అన్నవరం క్షేత్ర దర్శనంతో మరొకసారి స్వామి అనుభూతులు, లీలలు అనుభవంలోకి వచ్చాయి. అనంతమైన అయన లీలలు ఎంతచెప్పుకుంటే మాత్రం అవుతాయా !!! ఇంకొన్ని ఎప్పటికీ మిగిలే ఉంటాయి అన్ని విషయం తెలిసిందే కదా !!!
ఇన్ని చెప్పుకున్నాగానీ స్వామి పెట్టే పరీక్షలకి నాబోటి వాడు తట్టుకోగలడా !!!
ప్రారంభంలో కోరికలతో అజ్ఞానంతో కూడిన ఆశ, తరువాత ఫలితాలపై వచ్చే ఆనందం, ఇలా చెయ్యకపోతే దేవుడు శిక్షిస్తాడేమోనన్న భయం, మనకెందుకులే అనుకుంటూ ఒక ప్రయత్నం చెయ్యటం, పక్కవాళ్ళు చేస్తున్నారని వారి లాగే ఎదవ ఇమిటేషన్స్ (సారీ ఇంపాక్ట్ కోసం వేసిన పదం) ఇలా ఒక్కోడి భక్తి 'లైఫ్ సైకిల్' మొదలైతే మళ్ళీ , మళ్ళీ వచ్చే ఫలితాలు నమ్మకాన్ని ప్రోది చేసి దృఢనమ్మకంగా మారిస్తే, భక్తిలో వచ్చే ఆటుపోట్లు మన నమ్మకాన్ని పరీక్షకు గురి చేస్తాయి. సెన్సెక్స్ లాగ మన మానసిక స్థితి బాగా ఫ్లక్త్యువేట్ అయిపోతుంటుంది ఈ దశల్లో. పరీక్ష నెగ్గిన ప్రతీసారి దృఢ నమ్మకం ఇస్తే, భవిషత్, ఎక్కడి గొంగళి అక్కడే వేసినట్టు వుండే జీవితం అది పెట్టే పరీక్షలకి భయాన్ని, విసుగు, కోపాన్ని కూడా ఇస్తాయి. భక్తిలో వచ్చే బాధ్యత భయానికి గురిచేస్తుంది. ఇవన్నీ దాటాక కొంతకాలానికి అయోమయం స్థితిలోకి వస్తాము. గుడ్డెద్దు చేలో పడినట్టు ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసే ప్రయోగాలకి ఇలా తయారవుతాడు (మన అదృష్టానికి(!) మనకి దారి చూపే గురువు కూడా ఉండడు కాబట్టి తప్పదు) :). ఇవ్వన్నీ దాటాక ప్రశాంతంగా అంటీ అంటనట్టు, ముట్టీ ముట్టనట్టు మన కర్మ (పని) మనం చేస్తూ ఉంటాము. ఇదండీ షార్ట్ గా 'భక్తి లైఫ్ సైకిల్'. ఆ పైవాడు ఆడించే ఈ పరమపద సోపాన పటంలో ఒక్కో ఇక్కకి ఒక్కో అనుభవం. చూద్దాం పండించే వాడు ఆడిస్తున్నాడు ఏమి చేస్తాడో !!!!
తూర్పు గోదావరి జిల్లా అంత పచ్చని పచ్చదనంతో అలరారుతూ ఉంటుంది. అన్నవరం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇంకా పట్టణీకరణ రక్కసి బారిన పడకుండా కొండల నడుమ పచ్చని వాతావరణంలో సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో అలరారుతుంది.
అన్నవరం గుడి కి చేరుకున్నాక కొండపైకి వెళ్ళటానికి మెట్ల దారి, రోడ్ దారి వుంది. షేర్ ఆటోలు అవీ వున్నాయి. మెట్లదారి మొదట్లోనే స్వామి వారి పాదాలు వున్నాయి. అక్కడ చేతివేళ్ళతో భక్తులు కోరికలు నివేదించుకోవటం కనపడింది. మెట్లదారిలో అమ్మవార్ల గుడులు వున్నాయి. అవి దర్శించుకుని పైకి వెళ్ళాక ప్రసాదం కౌంటర్లు కనపడతాయి.
అక్కడనుంచి రెండు దార్లు కనపడతాయి. ఒక దారిలో రామచంద్ర ప్రభువు ఆలయం మొదటనే కనపడుతుంది. ఏ దారిలో అయినా కొన్ని మెట్లు ఎక్కితే ఆలయానికి చేరుకోవచ్చు. అక్కడ నుంచి మొబైల్స్ అవీ పెట్టి 'క్యూ' లైన్స్ లో ఆలయం లోపలి వెళ్ళితే స్వామి వారు మొదటి ఫ్లోర్ లో దర్శనం ఇస్తారు. అక్కడ చూసుకుని కింద ఫ్లోర్ లో యంత్రం దర్శనం ఉంటుంది. 50 రూపాయలు టికెట్ తీసుకుంటే దగ్గరకెళ్ళి అర్చన చేసుకోవచ్చు.
ఆలయంలో గోశాల, నీడ ఆధారంగా పనిచేసే సూర్య గడియారం, పాలాభిషేకంకి మేము సిద్దంగా ఉన్నట్టు చెట్టుకింద నాగ / సుబ్రహ్మణ్య / ఆంజనేయ స్వామి మూర్తులు మనోహరంగా దర్శనమిస్తాయి. పైన ఆలయం సమీపంలో అద్దెకు లభించే ఆలయపు గదులు 200 రూపాయల నుంచి ఉంటాయి అన్నట్టుగా తెలిసింది. ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. కనుక ఒక సారి టెంపుల్ సైట్ చూడగలరు. మేము అన్నవరం వాసవి సత్రంలో వున్నాము. మాకు ఇచ్చిన రూమ్ సరిగా లేక రాత్రి నిద్ర సరిగా పట్టలేదు. భోజనం బాగానే వుంది.
సత్యనారాయణ స్వామి అనగానే ముందుగా మన ఇళ్లలో గుర్తుకు వచ్చేది సకల శుభాలు కలిగించే స్వామి వారి వ్రతం మా పెళ్ళి అయిన తరువాత మొదటిసారి వ్రతం జరిగితే, రెండో సారి పెళ్లి మొక్కు తీర్చుకోవటం కోసం రెండవ అన్నవరంగా పేరు గాంచిన రంగాపురం లో రెండో సారి వ్రతం చేసుకోవటం జరిగింది. మళ్ళీ ముచ్చటగా మూడోసారి ఏకంగా అన్నవరంలో మూడుసారి అది కూడా పెళ్లి మొక్కుబడి లో భాగంగా జరగటం స్వామి వారి ఆపార అనుగ్రహమే కాని మనం నిమిత్తమాత్రులమే. స్వామి అనుగ్రహం ఈరూపేణ వెంట, వెంటనే దొరికింది అన్నమాట.
ఇక వ్రతం వివరాలు & మిగతా విషయాలగురించి వస్తే...
మొదటి స్లాట్ ఉదయం ౫.౩౦ నుంచి మొదలు అవుతుంది. శ్రీకాళహస్తి వలే వ్రతానికి మండపాల బట్టి ఒక్కో రేట్ వుంది. కనీసం 200/౩౦౦ రూపాయలు టికెట్ ఒకటి తీసుకోవాలి ఒక దంపతులకి. మేము ఐతే బావుంటుంది అంటే 400 రూపాయల టికెట్ తీసుకున్నాము. బయట ఆరు కొబ్బరికాయలు, అరటిపళ్ళతో పూజ సెట్ అమ్ముతారు. పూజకి వచ్చేటప్పుడు అది తెచ్చుకోవాలి. పసుపు, కుంకుమ వగైరాలు సరి చూసుకోండి. మేము సత్రంలో అమ్ముతున్నారు అంటే కొన్నాము గాని ఎందుచేతనో వాటిలో పసుపు మిస్ అయింది. అందుకే మీరు కొనేటప్పుడు పూజ సామాగ్రి సెట్ సరి చూసుకోండి.
పూజ మొత్తం కలిపి ఒక గంట నుంచి రెండు గంటల దాకా పడుతుంది. టికెట్ తీసుకుని మండపంలో కూర్చోవటం దగ్గర నుంచి వ్రత పరిసమాప్తి స్వామి దర్శనం అన్ని కలిపి ఒక రెండు నుంచి మూడు గంటలు పట్టవచ్చు. ఒక పూజారి గారు మైకులో వ్రత కథతో పాటు వివరాలన్నీ కూడా తెలుగు, హిందీ లో చెప్పారు. కన్నడ / తమిళ్ ఏదో ఒక భాషలో కూడా చెప్పారో లేదో గుర్తులేదు. మీకు ఏ బాషా రాకపోతే పక్కవారిని చూసి ఫాలో అయిపోవటమే :).
కొందరు పూజారులు బ్యాచ్ కింద వచ్చి భక్తులతో సంకల్పం అవీ చేయిస్తారు. తరువాత ప్రధాన పూజారి గారు వ్రత కథలు చెబుతారు. గణపతి పూజ, ఆవాహన, నవగ్రహ పూజ మిగతావి కూడా చేయించి సత్యనారాయణ వ్రతం మొదలుపెడతారు. వ్రతం పూర్తి అయ్యాక కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం సమర్పించాక మనకి స్వామి ప్రసాదం అందచేస్తారు. తరువాత పూజారి గారి దక్షిణతో అక్కడ నుంచి స్వామి దర్శనానికి బయలుదేరటమే . ఇది స్థూలంగా వ్రత వివరం. నాకు తెలిసింది, తోచింది చెప్పాను ఇంక మీదే లేట్. సత్యనారాయణ స్వామి పూర్తి ప్రసన్నవదనంతో, అనుగ్రహదృక్కులతో వున్నారు. మరి తొందర పండండి :).
ఆలయం వారి వెబ్ సైట్
ఆలయం పరిసరాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. సాయంత్రం పూట కాసేపు అక్కడ స్వామి ని తలుచుకుంటూ చల్లని వాతావరణాన్ని, ఆనంద తరంగాలని అనుభూతిలోకి తెచ్చుకోండి.
తలపులమ్మ లోవ అన్నవరంకి అతి దగ్గర వున్న మరొక ప్రసిద్ధి క్షేత్రం. కొండపైన అమ్మవారు అనుగ్రహిస్తారు. అన్నవరం నుంచి ఆటోలు ఉంటాయి. షేరింగ్ కష్టం. మేము తుని రోడ్ద నుంచి లోపలి వెళ్ళాలి అక్కడ దాకా వెళ్లి ఒక గంటసేపు నిరీక్షించిన ప్రయాణికులు లేక ఆటో మాట్లాడుకుని వెళ్ళవలసి వచ్చింది. కనుక మీరు ఆలోచించుకుని అన్నవరం లో ఆటో మాట్లాడుకోవటమో లేదా అనేది పరిస్థితులనుబట్టి నిశ్చయించుకోండి.
తలుపులమ్మ తల్లి ఆలయం వాహన పూజలకు చాలా ప్రసిద్ది. చుట్టుపక్కల జిల్లాలు వాళ్ళు , వాళ్ళ, వాళ్ళ వాహనాలు కొన్నప్పుడు సెంటిమెంట్ గా ఇక్కడే పూజ చేయిస్తారు. అమ్మ వారు వాహనాలు ప్రమాదానికి గురికాకుండా, తమను రక్షిస్తుందని ఇక్కడివారికి బాగా విశ్వాసం.
ఆలయం, అమ్మవారి దర్శనం చాలా బావుంది, బాగా జరిగాయి. వంట చేసిపెడతాము అని లోకల్స్ ఆడవారు వచ్చే జీపులు, వాహనాల వెంటబడి అడగటం కనిపించింది.
అక్కడ నుంచి తిరిగి అన్నవరం చేరుకొని మా యాత్ర ముగుస్తుంది అనుకునేంతలో పిఠాపురంలో శ్రీ పాద వల్లభ దర్శనం కోసం ఆగటంతో, పురుహూతికా అమ్మ వారి పూర్వాలయంతో పాటు ఊరి బైపాస్ రోడ్ దగ్గర వున్న అమ్మవారి ఆలయం, కుక్కుటేశ్వర స్వామి ఆలయం, ఇతర వుపాలయాల దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి.
ఇక్కడ షేర్ ఆటోలు పొద్దుపోయేదాకా ఉంటాయి కనుక పెద్ద సమస్య ఉండదు. ఏదోలా బ్రేక్ జర్నీలు చేసుకుని నెట్టుకు రావచ్చు. దాదాపు తూర్పు గోదావరి మొత్తం షేర్ ఆటో సర్వీస్ వుంది. కనుక పెద్దగా బస్సు లు గురించి ఆందోళన పడనవసరం లేదు.