అక్టోబర్ 2 నాడు సెలవు దినం కావటం తో ముందు రోజు ఎన్నో సంవత్స రాలనుండి వాయిదా పడుతున్న నా శిరిడి యాత్రకు ట్టకేలకు శిరిడి సాయి నాధుని దర్శించుటకు అనుమతి లభించింది. బెంగళూరు నుండి సుమారు 24 గంటలు పడుతుంది ట్రైన్ లో. యశ్వంతపూర్ నుంచి కూడా వున్నాయి షిరిడి కి డైరెక్ట్ గా వున్నాయి. అన్ని ట్రైన్స్ అన్ని రోజులు నడవవు కాబట్టి ఒక వారం అంతా ఏ ట్రైన్స్ నడుస్తున్నాయో చూసుకుని మీకు వీలువున్న ట్రైన్ ని ఎంచుకోండి. ఐతే నేను మేజస్టిక్ / బెంగళూరు సిటీ జంక్షన్ (SBC) నుండి కోపరగాన్ వెళ్ళే ట్రైన్ - కర్ణాటక యెక్ష్ప్రెస్ ను ఎంచుకున్నా (ఇది 16 గంటలే). దీనిలో తత్కాల్ దొరికింది. కోపరగాన్ నుండి షిరిడి సుమారు 15 కిలోమీటర్లు లోపుగా వుంటుంది. స్టేషన్ దిగి బయటకు వచ్చిన వెంటనే ఆటోలు దొరుకుతాయి. షిరిడి వెళ్ళే ప్రయాణికులతో మనం వెళ్ళితే 50 రూపాయలకు షేరింగ్ ఆటో లో వెళ్ళవచ్చు. మహారాష్ట్ర లో రోడ్డు సరిగా లేకపోవటం వల్ల కొంత ఇబ్బందే కాక సమయం కూడా వృదా అవుతుంది. షిరిడి ఆలయం ప్రదాన రహదారికి సరిగ్గా పక్కనే వుండటం వల్ల ఆటో వాళ్ళు ఆలయం ముందే దింపుతారు కాబాట్టి ఎదురుగానే కనిపిస్తుంది. ఒంటరిగా వెళ్ళేవాళ్లకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎందుకంటే పోలిసుల సూచనల దృష్ట్యా వసతి పెద్ద సమస్య రూములు ఎక్కడా ఇవ్వరు. నేను 3 సత్రాలు చూసాను మొదటిది అర్యవైశ్యులది - కాశి అన్నపూర్ణ సత్రం - రూం కోసం ప్రయత్నిస్తే 600 రూపాయలు సబ్యత్వం వుంటే 400 రూపాయలు చెప్పారు. తరువాత సైకిల్ బాబా సత్రం అందులో రూం విడిగా ఇచ్చే ప్రసక్తి లేదు అని పోలీసు వారి హెచరిక చూపారు. తరువాత గుంటూరు వారి సత్రం. అన్ని సత్రాలు కొంచెం అటు ఇటుగా 1 లేదా 2 కిలోమీటర్ల లోపే వుంటై. ఆటో వాళ్లకు ఇక్కడ బెంగళూరు వాళ్లకి మళ్లే షేరింగ్ కాన్సెప్ట్ తెలీదు అనుకుంటా. 30 నుంచి 50 వరకు అడుగుతారు ప్రతీసారి. గుంటూరు వారి సత్రం లో షేరింగ్ లో తీసుకున్నా, హాలు విశాలంగా వుంది. లాకర్ ఇచ్చారు. షేరింగ్ లో 50 రూపాయలు మాత్రమే - ఉదయం 7 నుంచి మళ్ళి 7 వరకు -24 గంటలు. 200 రూపాయలు అడ్వాన్సు తీసుకుంటారు, 150 వెనక్కి ఇచ్చేస్తారు ఒకరోజే ఉంటే. సౌకర్యంగానే వుంది. భజన సమాజం కూడా నడుపుతున్నారు. అల్పాహారం అవి చూసాను అక్కడ. బయట చేసాను కాబట్టి అవి ఉచితమా కాదా అనేది ఇదమిద్దంగా చెప్పలేను. అలయానికి గుంటూరు వారి సత్రం ఒక అర కిలోమీటరు వుంటుంది నడిచి పోవచ్చు లేదా రోడ్డు మీదకు వస్తే షేరింగ్ ఆటో లో రావచ్చు. దర్శనం 15 నిమిషాలలోనే అయిపోయింది. సాయినాధుని దర్శనం అయి మెట్లు దిగి బయటకు వచ్చేటప్పుడు ఎడమ పక్కగా తిరిగినవెంటనే మండపం లాగ కనిపిస్తుంది అక్కడ కూర్చుని ఎంతసేపు ఐన సాయి నాధుని ప్రత్యక్ష్యంగా తనివితీరా చూసుకోవచ్చు. ప్రతీచోట టీవీ అవీ కూడా ఏర్పాటు చేసారు లైవ్ లో చూడటానికి. తరువాత పక్కనే వేపచెట్టు తో కూడి గురుస్తాన్ వుంటుంది . ఆ తరువాత సాయి బాబా శిష్యుల సమాధులు, సాయి బాబా వాడిన వస్తువులతో కూడి మ్యూజియం ఆకట్టుకున్టై. ప్రసాదం కూడా అక్కడే 2 కౌంటర్లు వున్నాయి ఒకటి సొసైటీ వాళ్ళు నడిపేది. తరువాత మరొకటి వుంది. వీలైనంతవరకు 20, 35, 45 రూపాయలలో 45 రూపాయాలు వున్న ప్రసాదం తీసుకోండి తక్కువ రేటు వున్నది ఎక్కువ కాలం వుండదు పాడవుతుంది అని స్నేహితుడు చెప్పాడు. డ్రై ఫ్రూట్స్ కూడా వున్నాయి కాబట్టి అవి ఐతే ఇబ్బంది వుండదు అనుకుంటా. తరువాత సాయి బాబా నీళ్ళు తోడిన భావి, తానూ నీళ్ళు పోసి పెంచిన లెండీ భాగ్ తోట, పక్కన దత్తాత్రేయ చిన్న ఉపాలయం లాగ వుంది. ఇది అంతా ఆలయం మెట్లు దిగి ఎడమవైపుకు వస్తే, మరి కుడి వైపుకి వస్తే ఆంజనేయస్వామి ఉపాలయం, చావిడి, ద్వారకామాయి మందిరం. ఇంకా ఆలయం నుంచి బయటకు వచ్చి రోడ్ కి అవతలకు వస్తే ఖండోబా ఆలయమ్ వస్తుంది అండీ. ఇవన్నీచూడటం మరిచిపోవద్దు. ఇంకా గురువారం ఉదయం శని సింగనాపుర్ వెళ్ళాలని 8 గంటలకు టెంపుల్ పరిసరాలోకి వచ్చాను. వీలు ఐనంతవరకూ ఎట్టి పరిస్తితులలోను ఉదయమే బాయలుదేరండి. మళ్ళి సాయంత్రం ఐతే ఆలయం మూసేస్తారు అన్నారు. ఇక్కడ కూడా షేరింగ్ ఆటో లు వున్నాయి. రానుపోను కలిపి 100 తీసుకుంటారు. సుమారు మొత్తం 5 గంటలు పడుతుంది. పూజ సామాగ్రి అమ్మే షాపుల వాళ్ళతో జాగ్రత్త. పూజా సామాగ్రి మన తలకి తాకించి మంత్రం చెబుతారు. ఇంకా వాళ్ళు యెంత అడిగితె అంత ఇవ్వటమే. 250 తీసుకున్నారు అనుకుంటా మొదటిసారి కాబట్టి ). అక్కడ టాక్సీ స్టాండ్ నుండి ఆలయం దగ్గరే. ఇంతకు ముందు ఆలయం లో స్నానం చేసి బట్టలు విడిచిపెట్టి పంచె కట్టుకుని తైలాభిషేకం చేసి మళ్ళి స్నానం చేసి వచ్చేవారు అని చెప్పారు. అది తీసేశారు అని చెప్పారు. ఇప్పుడు మామూలు ఆలయం దర్శనం లాగానే చేసుకుంటాము. శనీశ్వరుని చుట్టూ రక్షణం ఏర్పాటు చేసారు దూరం నుంచి దర్శించుకోవటమే. పూజాసామాగ్రి, నువ్వులనూనె అవి అక్కడే ఏర్పాటు చేసిన వాటిలో పోయటమో, వెయ్యటమో చెయ్యాలి. నువ్వులనూనె పైపుల ద్వార స్వామి ని అభిషేకిస్తుంది. అక్కడ దర్శనం ఐన తరువాత మెల్లగా షిరిడి వచ్చేసాము. షిరిడి ఆలయం గేటు 4 అనుకుంటా అక్కడే విజయవాడ వారి హోటల్ అని వుంది. కొంచెం దూరం లో వుంది. బావుంది ఇక్కడ, వెళ్ళితే ఇక్కడ ప్రయతించండి ). గురువారం మధ్యానం ఐతే దర్శనం పది నిమిషాలలోనే అయిపోయింది. ఆఖరుగా ఖండోబా దేవాలయం దర్శించి అక్కడకు 3 కిలోమీటర్స్ అనుకుంటా సాయి నగర్ రైల్వే స్టేషన్ అక్కడ నుంచి పూణే కి పయనమయ్యాను. పూణే విశేషాలు తరువాత పోస్ట్ లో !!!
నాకు ఈ ట్రిప్ లో ఎంతో సహాయం చేసిన నా స్నేహితులు సురేష్ & రమేష్, శిరిడి లోనే పరిచయమైన శ్రీనివాస్ కి నా కృతజ్ఞతలు.
ఇన్ని చెప్పాను కదా మరి టైటిల్ లో క్వశ్చన్ మార్క్ ఏమిటి అని ఆలోచిస్తున్నారా ??? భగవంతుడు తోడుంటే ఒంటరి పయనం ఏమిటి అండీ మీరు మరీను ))).