Sunday, October 20, 2013

నాగలమడక సుబ్రహ్మణ్య మరియు పావగడ శ్రీ శనీశ్వర స్వామి దర్షనం

మేము ఇద్దరమూ - నేను, మా స్నేహితుడు బెంగళూరు నుండి
శుక్రవారము రాత్రి బయలుదేరాము మాకు అక్కడ APSRTC వాళ్ళ బస్సు స్టాప్, 10ఏ
ఫ్లాట్ఫారం చివరలో, 11.30PM పావగడకి కళ్యాణ దుర్గం బస్సు వుంది. ఆన్లైన్ లో తోమిదిన్నర కి ఒకటి,
పదిన్నరకి ఒకటి చూపించాయి. ఇదే ఆఖరి బస్సు అనుకుంటా. ఇక్కడకు పావగడ దాదాపు 170KM వస్తుంది.
మేము 3.30-4.00AM కి చేరిపోయాము. బస్సు స్టాప్ ఎదురుగానే టెంపుల్
వుంటుంది. ఒక ఫర్లాంగు దూరంలో బస చేయటానికి వీలుగా ఆలయం వాళ్ళదే సత్రం
వుంది. శని వారం మాత్రం కొంచెం ఎక్కువ రష్ వుంటుంది. ఒక రోజు ముందు రూం
బుక్ చేసుకోవాలి వుంటుంది. మిగతా రోజుల్లో రూమ్స్ ఖాళీగా
ఉంటాయి అని చెపారు. పురుషులకు మహిళలకు బాత్రూమ్స్ అవి వున్నాయి. ఓపెన్
ప్లేస్ లో పురుషులకు స్నానానికి కూడా అనువుగానే వుంది. ఆలయం లో మొదటి
దర్శనం లో చేసుకోవటానికి ప్రయతించండి. బయట పూజ సామాగ్రి 110 - 150 లోపు
తీసుకుంటారు.  సుమారు 4 నుంచి 4.30AM లోపు లైన్ లోకి వెళ్ళిపొండి. మొదటి
దర్శనం 5 కి ప్రారంభం అనుకుంట. ఆలయం లోపల 2 అంతస్తులలగా వుంటుంది ముందుగా
వెళ్ళితే నవగ్రహాలకు అభిముఖంగా కూర్చుంటాము. మొదటి దర్శనం తరువాత ఎక్కువ
సమయం పట్టదు. గుంపుగా ప్రదక్షిణం చేసేటపుడు నవగ్రహముల గద కొందరికి
ఇస్తున్నారు. వాటితో ప్రదక్షినమ్ చేస్తారు. లడ్డు ప్రసాదం మరియు కొంత నూనె
ప్రసాదంగా ఇచ్చారు. అక్కడకు దగ్గరలోనే ఆంజనేయస్వామి ఆలయం వుంది.
దేవస్థానం బయట బోర్డు వుంటుంది. అక్కడ ఎవరిని అడిగినా  చెప్తారు. బస్సు
స్టాండ్ దగ్గరలోనే వుంటుంది. కొండమీద కోట వుంది అన్నారు. మేము వెళ్ళలేదు.
11.00 AM తరువాత మేము అక్కడ నుండి 16 కిలో మీటర్లలో నాగల మడక సుబ్రహ్మణ్య
దేవస్తానం వుంటుంది. షేరింగ్ ఆటో లు లేవు. ఆటో వాళ్ళను ఆశ్రయించక పోవటమే
మంచిది. వందల్లో చెప్తారు. తెలుగు, కన్నడ పదాలు కొంచెం ఒకేలా ఉంటాయి కాబట్టి
తరువాత రేటు బేధం రిత్యా వివాదాలు అవుతున్టై .).  బస్సు కి పది రూపాయలు.
పక్కన అక్కడే ఉపాలయాలు కూడా వుంటై. తెలుగు, కన్నడ అందరికి వచ్చు కాబట్టి
భాషాపరంగా ఇబ్బంది వుండదు.

 మోహన్ కిషోర్ గారి బ్లాగ్ నాకు బాగా ఉపయోగపడింది. వారికి నా ధన్యవాదాలు.
'అలాగే కర్నాటక రాష్ట్రము నందు, మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు
కలవు. అవి ఆదిసుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య), మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి
సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక సుబ్రహ్మణ్య) అనే మూడు
అద్భుతమైన క్షేత్రాలు. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది అని, ఈ
మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల
కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి
అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు. ఇది సత్యం సత్యం పునః
సత్యం. '
http://shaktiputram.blogspot.in/2012_12_01_archive.html

రవి ప్రకాష్

No comments:

Post a Comment