పిఠాపురం లో వున్న కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు, అక్కడే వున్న పురుహూతికగా వున్న అమ్మవారి శక్తి పీఠం, శ్రీ పాద శ్రీ వల్లబుల పాదగయా క్షేత్రం, అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రాచీన కుంతీ మాధవ స్వామి ఆలయం, పక్కనే వున్న దత్త ఆశ్రమము. అక్కడనుంచి ద్రాక్షారామంలో వున్న అమ్మవారి మరొక శక్తి పీఠ దర్శనం (అమ్మ ఇక్కడ మాణిక్యాంబ), ఇక్కడే పంచారామంలో ఒకటిగా వినుతి కెక్కిన భీమేశ్వర ఆలయ మూల విరాట్టుగా శ్రీ భీమేశ్వర స్వామి దర్శనమిస్తాడు. అక్కడ నుండి మొక్కు చెల్లించుకునుటకు బిక్కవోలు 11 అడుగుల ఏక శిలా విగ్రహమూర్తిఐన వినాయకుడిని దర్శించుకుందామనుకుంటే, అక్కడే వున్న ప్రాచీన గోలింగేశ్వర ఆలయ దర్శనం కూడా ఐంది. ప్రతి ఆలయంలోనూ లెక్కకు మిక్కిలి వుపాలయాలు వున్నాయి. వాటి సంగతి చెప్పలేదు. ఇన్ని దర్శనాలు చేసుకోవటం ఒక ఎట్టు ఐతే ఒకేరోజు 2 శక్తి పీఠాల దర్శనం మరొక ఎత్తు.
శక్తి పీఠ దర్శనం గురించి ఆలోచిస్తే ఆషామాషి కాదు అనిపిస్తుంది ఒక్కోసారి. భగవంతుడు మనకి ఎప్పుడూ రెండు దారులు ఇస్తాడు. పరీక్ష లేనిదే పై మెట్టు ఎక్కలేము. మహాభక్తులకు పెట్టినట్లు కావు అని. ఒకోసారి చాలా చిన్నవిగా వుంటాయి. కాలు అటు వేస్తామా లేదా ఇటు వేస్తామా అని నవ్వుతూ చూస్తుంటాడు స్వామి. జీవిత పర్యంతం మనం నమ్మే నమ్మకం ప్రశ్నార్ధకం చేస్తాడు. వీడు ఏమి చేస్తాడో చూద్దామని :). ప్రతి నిత్యం స్వామి అనుగ్రహం, మహిమలు చవిచూస్తున్నా కానీ ఆ సమయంలో లోపల వున్న స్వార్ధం ప్రశ్నిస్తుంది. మన నమ్మకాని అడ్డుకునటానికి ప్రయత్నిస్తుంది.
ఇది నాది ఎందుకు ఎందుకివ్వాలి, ఐన అన్ని ఇచ్చిన స్వామికి మళ్లీ ఇవ్వటం ఎందుకు ?
ఇలా వుంటే బతకలేము.
ఐనా భక్తీ వుంటే చాలు.
నాకే ఎందుకు జరుగుతున్నాయి, నాకన్నా పాపాలు చేసిన వాళ్ళు బానే వున్నారు.
దేవుడు నిజంగా వుంటే ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి.
దేవుడా అది చెయ్యి అపుడు చూద్దాం.
ఇలా వంద ఆలోచనలు. అప్పటిదాకా అన్ని వదిలిపెట్టేసే వైరాగ్యం, అనుభవంలో ఒక చిన్నది వదులుకునే త్యాగం (పెద్ద పదం) చేయ్యలనగానే మెట్ట వేదాంతం, నాస్తిక రాగం :).
భగవంతుని పరీక్షలు లాగా కనిపించకపోయినా అవి చూచాయగా ఎలా ఉంటాయో రెండు ఉదాహరణలు చెప్పాలి అనుకుంటున్నాము.
మేము మైసూరు చాముండేశ్వరి అమ్మ వారి దర్శనం కోసం వెళ్ళినపుడు ప్రాతఃకాలం సుమారు 4 గంటల సమయంలో చేరుకున్నాము. 6 గంటల వరకు లాడ్జిలో వేడి నీళ్ళు రావు అన్నారు. వాటర్ ఐస్ వాటర్ లాగా వుంది. రిస్క్ చేస్తే ప్రాణాలే పోతాయి అన్నట్టు వుంది. గడ్డ కట్టుకుపోయే చలి బయట. అంతకంటే గడ్డకట్టించే వాటర్ మరొక పక్క. ఎట్టి పరిస్తితులలో భగవంతుడి మార్గంలో ఆగకూడదు అనే తెగువ. ఇన్నాళ్ళు భగవంతుడు వున్నాడు అనే నమ్మకానికి, మనం నమ్మే భగవంతుడు మన ప్రాధాన్యత జాబితాలో ఎక్కడ వున్నాడు అనే దానికి అనుభవ పూర్వక పరీక్ష. నువ్వు ప్రేమించే నీ భగవంతుడి కోసం నీ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేస్తావా ! అని ప్రశ్నించే అంతరంగం. నిలబడతామా !, పడిపోతామా!. మన ప్రాధాన్యాలు, ఆలోచనలు, భగవంతుని మీద వున్న నమ్మకం, దృక్పథం, వైరాగ్యం, అనేక రకాల భావోద్వేగాలు, అన్ని, అన్నీ ఒకేసారి ఇలాంటి టైం లో బయటకు వచ్చేస్తున్నాయి. ఓడితే పాశుపతాస్త్రం గైకొన్న అర్జునుడు అవుతాము. గెలిస్తే ? ..., భగవంతుని ప్రయత్నంలో గెలుపోటములు వుండవు. ప్రయత్నం ఒక్కటే వుంటుంది.
జీవితంలో మొదటి సారి స్నానం చేస్తున్న పర్యంతం కూడా చలికి గడ్డ కట్టుకు పోవటం జరిగింది. చెప్పలేదు కదా ! ఆరోజు ఉదయం అమ్మవారి ఆలయ దర్శనం అద్భుతంగా ఐంది :).
మరొక సంఘటన చెప్పాలి. సామర్ల కోట ట్రైన్ లో స్లీపర్ బుక్ చేసుకున్నాను. బెడ్ షీట్ నా దగ్గర లేదు. ట్రైన్ లో ఇవ్వలేదు. అది ప్రీమియం ట్రైన్ సాధారణ స్లీపర్. అర్ద రాత్రి ప్రయాణం. బయట గడ్డ కట్టించే చలి. తడిచిపోతున్న కిటికీ అద్దాలు. ట్రైన్ వేగానికి తలపుల సందుల్లోంచి బలం తాకుతూ చర్మాన్ని కోసేస్తున్న చలి గాలి. బెర్త్ మీద ఎటు తిరిగిన మరొకపక్క ఐస్ ఐపొతున్న పరిస్తితులు. బాగ్ లో ఏదైనా తీసుకుని కుదురుకుందామనుకుంటే రేపు దేవాలయానికి వెళ్ళే దుస్తులు ఎలా పడితే అలా ముట్టుకోవటం ఇష్టం లేదు. చలికి మృతి అన్న పేపర్ హెడ్డింగులు లీలగా మదిలో మెదులుతున్నాయి. హిమాయల యోగులు చలిని తట్టుకునే ప్రక్రియులు గురించి అంతరంగం కలలుగా వెతుకుతుంది. ఇంక అయిపోతాను, ఐపోయాను అనే సమయానికి బాగ్ లో వేరే చోట వున్న కర్చీఫ్ గుర్తుకు వచ్చి తలకు కట్టుకుని పడుకున్నా. ఇంతలో విజయవాడ వచ్చింది వేకువజాము 3:30 ఐంది. చలి జ్వరంలాగా వుంది. బయటకు వచ్చి తలతిప్పి చూసాను ఏమైనా మెడికల్ షాప్ వుంటుంది ఏమో అని. మా బోగి పక్కనే వుంది. వెంటనే షాప్ లో మాత్రలు కొనుక్కుని ఒకటి వేసుకుని వచ్చేసాను. షాప్ పేరు చూడలేదు అమ్మవారి పేరు ఎలాగు వుంటుంది అని :).
అరుణాచలం వెళ్ళేటపుడు ఇలాంటి పరిస్తితులే. రోడ్ బాలేదో, డ్రైవర్ బాలేదో గాని కచ్చితంగా ప్రమాదం జరుగుతుంది అనేలాగా వుంది ప్రయాణం. పంచ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవితంలో చివరి మజిలి లాగా వుంది. భగవంతుని దర్శన దారిలోనే ఆయనను చేరుకోవటం అని మానసికంగా సిద్ధం ఐన పరిస్తితులు. ప్రతీసారి, ప్రతీచోట, ఆయ క్షేత్రల శక్తిననుసరించి అడుగుపెట్టడానికి అర్హత పరీక్షలు పెట్టబడ్డాయి. చిత్రం ఏమిటంటే పరీక్షతో పాటే, మన అర్హతను అనుసరించి పరీక్షను గెలిచే పరిస్తితులు కలిపించబడటం. పరీక్ష పెట్టేవాడే, పరీక్ష గెలిపించటం. స్వామి దయకి, అమ్మ అపార కరుణకు ఇంత కన్నా నిదర్శనం ఏమి కావాలి చెప్పండి.
No comments:
Post a Comment