Monday, November 18, 2013

సోమేశ్వర ఆలయమ్, పాత మడివాల, బెంగళూరు


     ఇప్పుడు మనం చెప్పుకోబోయేది  చోళుల కాలం నాటి సోమేశ్వరుని ఆలయమ్. పరమశివుడు స్వయంభూగా సోమేశ్వరునిగా, మహిమల దేవుడిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చరిత్ర చెబుతున్నది. వికీ ప్రకారం ఇది చోలులకాలం 12 వ శతాబ్దం (1247 AD) ముందిదిగా కనిపిస్తుంది. సుమారు తొమ్మిది తరాలు ఒకే కుటుబం నుంచి స్వామి అర్చకులుగా పని చేస్తున్నారు అని మా స్నేహితుడు తెలిపాడు. తనూ, తన స్నేహితుడు ఉద్యోగ జీవనం లో ఎదుర్కొన్న ఇబ్బందులు స్వామి చేసిన లీలలు తను చెప్తుంటే నమ్మి నిలిచి ఒక అడుగు భగవంతుడు కోసం వేస్తె ఆయన మనకోసం ఎన్ని అడుగులో వేస్తాడో అనిపించింది. మరి మీరు ప్రయత్నిస్తారా ఒకసారి ).   

అర్చనకు 5 రూపాయల టికెట్ వుంది. అభిషేకాలు పూజలు అన్ని మామూలు గానే జరుగుతాయి. కార్తీక మాసం లో పర్వదినాలలో దీపాల వెలుగులో దేవాలయం వెలిగిపోతూ వుంటుంది. దీపాల శోభలో కార్తీక పౌర్ణమి రోజు చూడాలి ఆ సోయగం.

వినాయక స్వామి, ప్రథమ గణపతి, దక్షిణ మూర్తి, శ్రీనివాస స్వామి, సుబ్రహ్మనఎస్వర స్వామి, బ్రహ్మ, పార్వతి దేవి, అన్నపూర్ణేశ్వరి దేవి, ఆంజనేయ స్వామి, కాల భైరవ స్వామి, సూర్య భగవానులను అంతరాలయం లో ఇక్కడ చూడవచ్చు. అక్కడే యుపలాలుగా నవగ్రహాలు, అయ్యప్ప స్వామి దర్శనమిస్తారు.

చేరుకోవటం ఎలా

BTM దగ్గర భారతి AXA బిల్డింగ్ బస్సు స్టాప్ నుంచి రెండు నిమిషాలు సిల్క్ బోర్డు వైపు నడిస్తే ఎడం పక్కగా పవన్ హోటల్ వస్తుంది. ఆక్కడ ఎడం పక్క సందు లోకి ప్రవేశించి సందు చివరకు చేరుకోవాలి.  అక్కడ కుడివైపుకు తిరిగి ఒక నిమిషం నడిస్తే మరియమ్మ ఆలయం వస్తుంది ఆక్కడ నుంచి ఒక నిమిషం ఎడం వైపుగా నడిస్తే సోమేశ్వర ఆలయం కనిపిస్తుంది.

మరో మార్గం ఏమిటి అంటే, BTM దగ్గర భారతి AXA బిల్డింగ్ వెనకవైపుకు చేరుకొని సిల్క్ బోర్డు వైపుకు సందు లో నడుస్తుంటే మనకు మరియమ్మ ఆలయం, సోమేశ్వర ఆలయాలు వరసగా కనిపిస్తాయి. అక్కడ ఎవరిని అడిగిన దారి చెప్తారు.



       
కార్తీక పున్నమి నాడు చూడాలి స్వామి వైభవం



Saturday, November 2, 2013

నారాయణ ధామం, పూణే

పరమ ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ అందమైన కొండలు, లేలేత పచ్చిక బయళ్ళు, కాలుష్య కోరలు పడని నేలలు, మంద్రంగా వీచే గాలి పాటలు,  వీటన్నిటికి మించిన వేంకటేశుని అందం !!! ఓహ్ ! చూడాలంటె పూణే శివార్లలో వున్న నారాయణ పూర్ వెళ్ళాల్సిందే.

శిరిడి యాత్ర ముగించుకున్న తరువాత పూణే లో వున్న స్నేహితుడిని చూడడానికి వెళ్లాను. తనతో పాటు నారాయణ ధామ్ చూడాలని బైక్ మీద మగరపట్ట నుండి ప్రయాణం మొదలెట్టాము. ఇది పూణే కి సుమారు 40-50 కిలోమీటర్స్ వస్తుంది. ఇది శివార్లలో చిన్న చిన్న పల్లెలు దాటుకుంటూ వెళుతుంది కాబట్టి ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగింది. వెళ్ళేదారిలో కొండలను చుట్టుముట్టిన మంచుతెరల మీద వెళుతున్నపుడు ఓహ్! అది వర్ణించవీలుకానిది. వెళ్ళేదారిలో పురాతన ఆలయం కనిపించింది కానీ వెళ్ళలేదు. ఎగుడు దిగుడు కొండలలో మలుపులు తిరుగుతూ ప్రయాణం చాలా బాగా సాగింది. దీనికి తోడూ సన్నపాటి వర్షం వల్ల అందం ద్విగునీకృతమైనదనిపించింది.

ఆలయ ఆవరణం లో ప్రవేశించగానే తెలుగు భక్తి గీతాలు విని ఆశ్చర్య పోయాను. ఇది తెలుగు వాళ్ళు కట్టించారు అని సుమారు 200 కోట్లు ఖర్చు ఐంది అని తెలుసుకున్నాక ఇంకా ఆశ్చర్యం వేసింది. పరిశుభ్రతకు, ప్రశాంతతకు, మరియు క్రమశిక్షణనకు మారు పేరులా వుంది. అన్నిటికి మించి భగవంతునికి దగ్గరగా వచ్చినట్టు వుంది. వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్నప్పుడు ఆ అందం గురించి యెంత చెప్పినా తక్కువే అనిపించింది. పెద్ద తిరుపతి లో ఎలా ఐతే పూజాది కార్యక్రమాలు జరుగుతాయో అన్ని అలానే జరుగుతాయి అని పూజారులు చెప్పారు. వారు తెలుగు వారేనని తిరుపతి గుడిలో పని చేసారని ఆ రోజు బ్రహ్మోత్సవాలు మొదటి రోజు అని చెప్పారు. మాకు కొంత ఆశ్చర్యం కొంత ఆనందం వేసాయి. పర్వదినాలు మనం గుర్తుపెట్టుకున్నమ లేదా అని కాక భగవంతుడు మనకు గుర్తుచేసేలాగా మన అంతరిక భక్తీ, సాన్నిహిత్యం వుండడం ముఖ్యం అనిపించింది :). దేవాలయం ఆలయ దర్శనం పూర్తిగా ఉచితం. చాలా అతి కొద్ది దెవాలయలలో మాత్రమే మనం ఇది చూస్తాము అనుకుంటా. ఉపాలయాలు అన్ని దర్శించుకున్నాము. దశావతారముల కథాక్రమం తో దేవాలయం పై చెక్కిన ప్రతిమలు బావున్నాయి. దేవాలయం లో అందరికి లడ్డు ఉచిత ప్రసాదంగా  ఇచ్చారు. దేవాలయ అన్నదానం సత్రం కి వెళ్ళాము. నిర్వహణ చాలా బావుంది. ఎంత తిన్నా పెడతారు కాని కొద్ది కొద్దిగ పలు దఫాలుగా పెడతారు. అనవసరంగా వృథా చెయ్యకూడదు అన్న వాళ్ళ సంకల్పం నచ్చింది. ముఖ్యం గా అన్నదాన సత్రాలు పరిశుబ్రంగా నిర్వహించటం చాలా కష్టం అనుకుంటున్నా. దేవాలయ దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన వెంటనే పరిసరాలలో సీతాపలాలు కనిపించాయి. సీజన్లో లో మొదటి సారిగా మొదటిది తిన్నానేమో అత్యద్భుతం గా వుంది. ఇక పరిసరాలు చూసుకుంటూ తిరుగు ప్రయాణం ఐయ్యాము.












ప్రసన్న వెంకటేశ్వర స్వామి, చిక్క తిరుపతి - మన వూరి దేవుడు.





   కొన్ని ఆలయాలు శక్తి వంతంగా వున్నా ఆదరణకు ఆమడ దూరంలో వుంటాయి. కొన్ని ఆలయాలు కాస్త అటు ఇటు గా వున్నా ఆదరణలో మాత్రం చాల ముందు వరసలో ఉంటాయి. అగ్ని ప్రతిష్టత చిక్క తిరుపతి వేంకటేశ్వరుని ఆలయం మొదటి కోవలోకి వచ్చేలాగ వుంది. చిన్నపుడు  దైవం, అందరు ఒకచోట భజానా కాలక్షేపం లాంటివి రాములవారి గుడిలో జరుగుతుండేవి. ఇపుడు సాయి బాబా ఆలయాలలో జరుగుతున్నాయి. ప్రదాన రహదారికి ఆనుకునే వున్న ఈ ఆలయమ్ బెంగుళూరుకి డెబ్బై కిలోమీటర్స్ వస్తుంది. బస్సు లో ఐతే మలూర్ కి యాభై కిలోమీటర్స్ అక్కడ నుండి సరాసరి గుడి కి 20 కిలోమీటర్స్ వస్తుంది. ఎలెక్ట్రానిక్ సిటీ మీదుగా బైక్ లో వెళ్ళితే నలబై కిలోమీటర్స్ లోపే అని స్నేహితుడు చెప్పాడు. ఎప్పటిలాగే మేజస్టిక్ బస్సు స్టాండ్ దగ్గర వున్న APSRTC బస్సు స్టాండ్ నుంచి మాలుర్ కి వెళ్లి అక్కడ నుండి చిక్క తిరుపతి బస్సు లో వెళ్ళాము. కోలార్ మీద నుంచి కూడా రూట్ వుంది అని తెలిసింది. ఇది కోలార్ జిల్లా లోకే వస్తుంది.  అక్కడ కోటి లింగాలను దర్శించి వచ్చేవాళ్ళు ఉండవచ్చు. ఆలయం దర్శనం కి మేము వెళ్ళే సరికి మధ్యానం అయిపోయింది. ఇక సాయత్రం దర్శనమే అనుకునే సమయానికి తెలిసిన విషయం ఏమిటి అంటే బ్రేక్ వుండదు, సాయత్రం వరకు ఆలయం తెరిచే వుంటుంది అని :). భగవంతుని అపార దయ అంటే ఇదే అని పించింది. పొద్దున్న నుంచి ఏమి తినలేదు జీవుడిని నిలబెట్టటానికి ఏదో కొద్దిగా ఆపదర్మంగా స్వీకరించాము. ఆలాంటి సమయం లో ఇలాంటి వార్త అంటే మీరే ఊహించుకోవండి :). దర్శనం చాల బాగా జరిగింది. భగవంతుని సమర్పించిన దండలను పూజారి గారు ప్రతి ఒక్కరి మేడలో వేస్తుంటే చాల చిత్రమైన ఫీలింగ్ ల అనిపించింది VIP దర్శనం లా :). ఆలయం లో కోతుల హడావుడి కనిపించింది పాపం ఆకలితో అవి ఏవి ఏవి దొరుకుతాయ అని ఎదురుచూస్తునట్టు అనిపించింది. ప్రసాదం స్వీకరించి తిరుగు ప్రయాణం అయ్యాము. కాస్త జన జీవన స్రవంతి నుంచి దూరంగా వుండి వచ్చాము అనిపించింది. ఎలా అంటే మన వూరి రాముల వారి గుడిలోకి వెళ్లివచ్చినట్టు.












మరిన్ని 
విశేషాలకు ఈ క్రింది లింక్ పరిశీలించగలరు

http://www.vishnutemplesofkarnataka.info/Kolar/mallurchikkatirupathi.htm