
కొన్ని ఆలయాలు శక్తి వంతంగా వున్నా ఆదరణకు ఆమడ దూరంలో వుంటాయి. కొన్ని ఆలయాలు కాస్త అటు ఇటు గా వున్నా ఆదరణలో మాత్రం చాల ముందు వరసలో ఉంటాయి. అగ్ని ప్రతిష్టత చిక్క తిరుపతి వేంకటేశ్వరుని ఆలయం మొదటి కోవలోకి వచ్చేలాగ వుంది. చిన్నపుడు దైవం, అందరు ఒకచోట భజానా కాలక్షేపం లాంటివి రాములవారి గుడిలో జరుగుతుండేవి. ఇపుడు సాయి బాబా ఆలయాలలో జరుగుతున్నాయి. ప్రదాన రహదారికి ఆనుకునే వున్న ఈ ఆలయమ్ బెంగుళూరుకి డెబ్బై కిలోమీటర్స్ వస్తుంది. బస్సు లో ఐతే మలూర్ కి యాభై కిలోమీటర్స్ అక్కడ నుండి సరాసరి గుడి కి 20 కిలోమీటర్స్ వస్తుంది. ఎలెక్ట్రానిక్ సిటీ మీదుగా బైక్ లో వెళ్ళితే నలబై కిలోమీటర్స్ లోపే అని స్నేహితుడు చెప్పాడు. ఎప్పటిలాగే మేజస్టిక్ బస్సు స్టాండ్ దగ్గర వున్న APSRTC బస్సు స్టాండ్ నుంచి మాలుర్ కి వెళ్లి అక్కడ నుండి చిక్క తిరుపతి బస్సు లో వెళ్ళాము. కోలార్ మీద నుంచి కూడా రూట్ వుంది అని తెలిసింది. ఇది కోలార్ జిల్లా లోకే వస్తుంది. అక్కడ కోటి లింగాలను దర్శించి వచ్చేవాళ్ళు ఉండవచ్చు. ఆలయం దర్శనం కి మేము వెళ్ళే సరికి మధ్యానం అయిపోయింది. ఇక సాయత్రం దర్శనమే అనుకునే సమయానికి తెలిసిన విషయం ఏమిటి అంటే బ్రేక్ వుండదు, సాయత్రం వరకు ఆలయం తెరిచే వుంటుంది అని :). భగవంతుని అపార దయ అంటే ఇదే అని పించింది. పొద్దున్న నుంచి ఏమి తినలేదు జీవుడిని నిలబెట్టటానికి ఏదో కొద్దిగా ఆపదర్మంగా స్వీకరించాము. ఆలాంటి సమయం లో ఇలాంటి వార్త అంటే మీరే ఊహించుకోవండి :). దర్శనం చాల బాగా జరిగింది. భగవంతుని సమర్పించిన దండలను పూజారి గారు ప్రతి ఒక్కరి మేడలో వేస్తుంటే చాల చిత్రమైన ఫీలింగ్ ల అనిపించింది VIP దర్శనం లా :). ఆలయం లో కోతుల హడావుడి కనిపించింది పాపం ఆకలితో అవి ఏవి ఏవి దొరుకుతాయ అని ఎదురుచూస్తునట్టు అనిపించింది. ప్రసాదం స్వీకరించి తిరుగు ప్రయాణం అయ్యాము. కాస్త జన జీవన స్రవంతి నుంచి దూరంగా వుండి వచ్చాము అనిపించింది. ఎలా అంటే మన వూరి రాముల వారి గుడిలోకి వెళ్లివచ్చినట్టు.



మరిన్ని
విశేషాలకు ఈ క్రింది లింక్ పరిశీలించగలరు
http://www.vishnutemplesofkarnataka.info/Kolar/mallurchikkatirupathi.htm
No comments:
Post a Comment