ఒకానొకప్పుడు శంకరుడు మానవులకు నాలుగు వరాలిచ్చాడు. వీటిలో మొదటిది- “దర్శనాత్ అభ్రశదసి”. చిదంబరంలో పరమేశ్వరుడి జ్ఞానంతో దర్శించటం. ఇది కుదరకపోతే “జననాత్ కమలాలయే”. కమలాలయే అంటే తిరువారూర్. అక్కడ పుడితే మోక్షం లభిస్తుంది. కానీ పుట్టడం మన చేతిలో లేదు కదా! అందువల్ల ” కాశ్యాంతు మరణాన్ ముక్తిహి కాశీ”. వారణాసిలో ప్రాణం వదిలి పెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తానన్నాడు. మరణం కూడా మన చేతుల్లో ఉండదు. అందువల్ల “స్మరణాత్ అరుణాచలే” అన్నాడు. అరుణాచల శివుడిని తలుచుకుంటే పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. అరుణాచల క్షేత్రం అంత గొప్పది....
(ఈ బ్లాగ్ నుంచి)
రాజా చంద్ర గారు అత్యంత విలువైన సమగ్రమైన సమాచారం ఇచ్చారు. మాకే కాదు అందరికి కూడా ఉపయోగపడుతుంది అని కింద లంకెలు ఇస్తున్నాను,
http://www.templeinformation.in/2012/02/blog-post.html
http://www.templeinformation.in/2013/10/tiruvannamalai-girivalam.html
తిరువణ్ణామలై ఆలయ విశేషాలు, గొప్పతనం ఇతర విషయాలు గురించి ఇప్పటికే నెట్ లో విసృతంగా సమాచారం వుంది. కావున లంకెలు ఇస్తున్నాను. ఒకసారి చూసి మిగతా చదవండి.
లంకె 1
లంకె 2
లంకె 3
లంకె 4
లంకె 5
లంకె 6
అరుణాచలం లేదా తిరువణ్ణామలై గురించి చెప్పగానే రెండు విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఒకటి రమణ మహర్షి, రెండు అరుణ గిరి. బ్రహ్మ, విష్ణు ఎవరు గొప్ప అని కలహించు కుంటే మధ్యలో ఒక ఆది, అంతం లేని తేజో లింగ ఆవిర్భావ కథ విన్నారు కదా ! అది ఇక్కడిదే.
హొయసల రాజైన మూడవ వీర భళ్ళాలుని భక్తిని గురించి ఈ సందర్భంలో ఒకసారి స్మరించాలి. అరుణాచలేశ్వరుడు ఒకసారి తన భక్తి పరీక్షింపగోరి జంగమ దేవర వేషంలో విచ్చేసి, దేవదాసి సేవకి ఏర్పాట్లు చెయ్యమన్నాడు. జంగమ దేవరకు తప్ప దాసీ అందరికీ దొరికారు. దాంతో రాజు రెండవ భార్య ఐన రాణి చల్లమా దేవి తానే, దాసి సేవకై జంగమ దేవర మందిరంలో ప్రవేశించి జంగమ దేవరని తాకగానే, జంగమ దేవర పసిపిల్లవాడిగా మారిపోయి, పిల్లలు లేని ఆ రాజదంపతులను కాసేపు అలరించాడు. అశరీరవాణి, ఓ రాజా ! పిల్లలు లేని నీకు ఆ లోటును తీర్చటానికి పిల్లవాడినై అలరించాను. నీకు ఇక లోటేం వుండదు. నీ శ్రాద్ధాన్ని నేను నిర్వహిస్తాను అని అపీతకుచాంబా సమేతుడై, నంది వాహనరూఢుడై . అరుణాచలేశ్వరుడు దర్శన మిచ్చాడు. దీనికి రుజువుగా ఇప్పటికీ అరుణాచలేశ్వరుడు యజమానిగా ఫిబ్రవరి మాసంలో రాజుకు యదావిధిగా శ్రాద్ధం నిర్వహిస్తారు.
(గురు - గిరి - గుడి (శ్రీ రమణాశ్రమం వారి గైడు నుంచి)
భగవాన్ శ్రీ రమణులు 16 వ యేటన ఆత్మజ్ఞానం పొంది 54 సంవత్సరాల తమ నిర్యాణ పర్యంతమ్ ఇక్కడే నివసించారు.
శాక్తవులు ఈ గిరిని 43 కొణాలున్న శ్రీ చక్ర మేరువుగా దర్శిస్తే, ఆది శంకరులు మేరు గిరిగా వర్ణించారు. వైష్ణవులు ఈ గిరిని సుదర్శన చక్రమని విశ్వసిస్తారు.
ఇక మా యాత్రకొస్తే, చిన్న చిన్న సమస్యలు రానే వచ్చాయి. మేము దిగవలసిన చోటుకి కాకుండా బస్సు వాడు 90 కిలోమీటర్లు దాటిపోవటం, వచ్చేటప్పుడు 2 గంటలు పైన ట్రైన్ ఆలస్యంగా రావటం వంటివి వున్నా పరమశివుని మదిలో పెట్టుకున్నందున ఇవేవీ పెద్దగా బాధించలేదు. మేము చేసిన సత్కర్మలు, మమ్మలిని వెనకకు లాగే దుష్కర్మలను శమింపచేసాయి అనుకున్నాము. ఐనా ఇప్పుడు ఆలోచిస్తుంటే మేము ఆ వేళ, అలా దాటిపోకుంటే అస్సలు ప్రదక్షిణ చేయ్యగలిగే వాళ్ళమా అనిపిస్తుంది. గుడి దర్శనం అయ్యేసరికే 10 దాటిపోతే ఇంకా ప్రదక్షిణ కనీసం 4 గంటలు తక్కువకాదు. అంత మండుటెండలో అది సాధ్యమయ్యేపనికాదు కూడా.
స్మరణాత్ ముక్తినొసగే క్షేత్రం అరుణాచలం. ఆలయం బస్సు స్టాండ్ నుంచి ఒక అర్ధ కిలోమీటరు వుంటుంది. రమణాశ్రయం, ఆలయం మీదుగా 3 కిలోమీటర్లు. ఇక్కడ తమిళులు మిగత చోట్ల కాకుండా కొంచెం తెలుగులో, ఇంగ్లీష్ లోనో మాట్లాడుతూ, దారి చెప్పి సహాయం చేసారు. తెలుగు వాళ్ళు కూడా అక్కడ అక్కడ కనపడ్డారు.
దేవాలయానికి అభిముఖముగా నుంచుంటే, కుడిపక్కగా ఒక ఫలహారశాల, ఆ పక్కనే చిన్న పుస్తకాలు షాపు కనపడతాయి. మేము అక్కడే రూం తీసుకున్నాము. ఇద్దరికి సరిపోయేలాగా వుంది. 300 రూపాయలు ఒక రోజుకి బాడుగ అని చెప్పారు. ఆ పుస్తకాల షాపు మరియు ఓనర్ అనుకుంట తను, కొంచెం యాత్రికులకు సహాయం చేసే గుణంగా కనిపించింది. తెలుగు పుస్తకాల కోసం అడిగితే ఆ పక్కనే రెండు భవనాల పక్కన ఇంకో షాపు చూపించాడు. అక్కడ అరుణాచల మహాత్మ్యం, గురు-గిరి-గుడి గైడు కొన్నాము. గిరి వలయ మ్యాప్పు, ఆలయం మ్యాప్పు రెండూ కూడా అరుణాచల మహాత్మ్యం పుస్తకం లో వున్నవి. ఐతే ఆలయంలోకి తీసుకుని వెళ్ళలేదు. జనం కొంచెం పల్చగానే వున్నారు. మొత్తం మీద రెండు గంటలు పైన పట్టింది. చాలా ఉపాలయాలు వున్నాయి. కోనేరు తలుపులు వేసి వున్నాయి. విశాయలమైన గోపురాలు, ఆలయ సముదాయాలు, వందల వేల సంవత్సరాల తరువాత కూడా ఇంత జనాభాకు సరిపోతున్నాయి అంటే అప్పటి ఆలోచనలకూ, మేధస్సుకు వహ్! అనిపిస్తుంది.
అయ్యవారి దర్శనం అమ్మవారి దర్శనం బాగా జరిగింది. అయ్యవారి దర్శనమప్పుడు గర్బాలయం లో అగ్ని లింగం కాబట్టి అక్కడ దగ్గరగా వుంటే విపరీతమైన వేడి అనుభూతితో చెమటలు కక్కుతాము అని ప్రతీతి. అలా విన్నపుడు మనకు అలాంటి అనుభవం కలిగితే బావుండును అనిపిస్తుంది కదా ? నాకు నా అర్హతకు అలాంటిదే ఒకటి అనుభవం లోకి వచ్చింది. సరిగ్గా అయ్యగారి ముందుకు వచ్చేసరికి, దీప సెగ మాములు కంటే ఎక్కువగా హారతి సమయంలో తాకినట్లు అనుభూతి కి లోనయ్యాను. స్వామి తేజో లింగం కాబట్టి గర్భగుడి దర్శనంలా కాకుండా ఇలా అనుగ్రహించాడు అనుకున్నాను :).
ఇక్కడ ఉచిత ప్రసాదం లేదు కాబోలు, వెల వుంది. పులిహోర, ఇతర ప్రసాదాలు వున్నాయి. ఎంత కొంచెం ఐనా వచ్చిన ప్రతీ భక్తునికి స్వామి వారి ఉచిత ప్రసాదం ఏర్పాటు చేసి వుంటే బావుండును అనిపించింది.
ఆలయం లోపల దేవస్తానం వారిదో మరి ఎవరిదో ఒక ఏనుగు వుంది. చిల్లర ఇస్తుంటే తొండంతో ఆశీర్వాదం ఇస్తుంది. పిల్లలు అక్కడ గుమిగూడి కొంచెం సరదాగా వుంది.
రమణ మహర్షి తపస్సు చేసిన పాతాళ గుహాలయం అక్కడే వుంది. ఆలయ దర్శనం ఐపోయిన తరువాత బసకు వచ్చి కొంచెం సేద తీరి, గుడి ముందే ఆంధ్ర మెస్ అని వుంటే అక్కడ భోజం చేసాము. వాళ్ళది గుంటూరు అని తెలిసింది వున్నతలో అడిగి బాగా పెట్టారు :).
ఇక ప్రదక్షిణ కొస్తే సాయత్రం 4 దాటినా తరువాత గుడి బయట దండం పెట్టుకుని బయలుదేరాము. కొద్దిగా ఎండ వుంది. కాళ్ళు కాలతున్నాయి. అష్ట లింగాలలో మొదటి లింగం గుడి ముందే వుంది అని తరువాత తెలిసింది. మేము అది తప్ప మిగతా అన్ని లింగాల దర్శనం చేసుకున్నట్టు గుర్తు. ఇంకా ప్రదక్షిణ ముందుకు చేసేకొద్దీ శ్రమ, భక్తీ, అలసట, భగవంతునిపై నమ్మకం పరీక్షలా అనుభవంలోకి రాసాగింది.
"అరుణాచల శివ" "అరుణాచల శివ" వెంటిలేటరు మీద వూపిరిలూదుతున్నట్టు నామజపమే శ్వాసగా, ప్రాణంగా, నమ్మకమే విశ్వాసంగా ముందుకు నడిచాము. అస్సలు మా వల్ల అవుతుందో లేదో, చెయ్యగలమో లేదో మా కర్మ మమ్మలిని వెనుకకు లాగుతుందేమో అని ప్రదక్షిణ చివరి అడుగు పూర్తిచేసేవరకూ కూడా మనసులో ఏదో ఒక మూల చిన్న సంశయం, భయం, వీటిని అధిగమించే అయన మీద భక్తీ.
భగవంతుని నమ్మి ముందుకు నడిచేవాడికి ఆలస్యం అవుతుంది ఏమోకాని ఓడిపోవటం అనేది జరగని విషయం అంటుంటారు. అది మరొకసారి అనుభవం లోకి వచ్చింది ఈ యాత్ర తో.
ప్రదక్షిణ చేసే వాళ్ళు గమనించ వలసిన విషయాలు:
----------------------------------------------------
ప్రదక్షిణ ప్రియాయ నమః అని అష్టోత్తర నామం ఒకసారి గుర్తు చేసుకోండి :).
అరుణాచలేశ్వరుడు, అమ్మవారిని దర్శించుకునే గుడి సమయం, గిరి వలయ ప్రదక్షిణం ఒక్కేసమయం లో చెయ్యకుండా చూసుకోండి. ఎందుకంటే గుడిలో దాదాపు రెండు గంటల సమయం పైన పడుతుంది. మళ్లీ గిరిప్రదక్షిణ 14 కిలోమీటర్లు పడుతుంది. అలానే గిరిప్రదక్షిణ మార్గంలో రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. అక్కడ ఆశ్రమం మొత్తం చూడాలంటే టైం పడుతుంది. మాకు మొత్తం 5 గంటలు దాకా పట్టేసింది. మాములుగా ఒక్క గిరిప్రదక్షిణ అంటే మూడు గంటల దాకా పడుతుంది. మనం ముఖ్య ఆలయాలు మాత్రమే చూసుకుంటూ పోతె 4 గంటలు పట్టవచ్చు. దాదాపు పెద్ద ఆలయాలు, ప్రముఖ ఆలయాలు అన్ని రహదారికిరు పక్కన వుండటం వల్ల అంత సమస్య వుండదు. అన్ని చూడాలి అంటే ఒకటి నుండి నాలుగు రోజులు పడుతుంది అని పుస్తకం లో చదివాము.
ఆడవారు వంటరిగా చెయ్యవద్దు. తోడుగా తప్పనిసరిగా ఎవరినో ఒకిరిని తీసుకువెళ్ళండి.
పున్నమి రొజులలో లక్ష మంది ప్రదక్షిణ చేస్తారని చెప్తారు. రోడ్ పైన నడవటానికే చోటు లేనంతగా.
రోడ్డుకి ఎడమ వైపునే నడవ్వాలి. ఇది మాకు తెలిసిన విషయమే అని అంటారా ? ఆగండాగండి, ఇది రహదారి భద్రతా కోణం కాదు. అనవసర దేవా, సిద్దపురుష శాపానికి గురికాకుండా. అవును గిరి ప్రదక్షిణ మార్గంలో కుడి పక్కన దేవా, సిద్ధ, రుషి పుంగవులు అదృశ్య రూపంలో ప్రదక్షిణ చేస్తారని ప్రతీతి.
రోడ్డుకి ఎడమ పక్కన నడవటానికి వీలుగా ఫూట్ పాత్ నిర్మించారు. దాని మీద నడవండి సాధ్యమైనంత వరకు.
మనం ఆఖరుగా సిటీలోకి వచేస్తాము అనుకుంటుండగా ప్రధాన రహదారికి ఎడమ పక్కగా ఒక చిన్న రోడ్ వుంటుంది. అక్కడ ఆఖరు ముఖ్య ఆలయం ఈశాన్య లింగం వుంటుంది. ఇక్కడే ఎడమపక్క స్మశానం వుంటుంది. అక్కడ దండలు రోడ్ మీద వేసేస్తున్నారు. అక్కడ చూసుకుంటూ వెళ్ళటం కొంచెం బాధ అనిపిస్తుంది. ఐతే రోడ్ కి అక్కడ మాత్రం కుడి పక్కన ఫుట్ పాత్ వుంటుంది. ప్రదక్షిణ నియమములో కుడి వైపు దేవతా సంచారం వుంటుంది అన్న నియమం గుర్తుకు వచ్చి, ఫుట్ పాత్ ఉన్నాగాని ఎలాగో దారి చూసుకుని తొక్కకుండా ఈశాన్య లింగ దర్శనం కూడా చేసుకున్నా :).
ఇక్కడ ఒకచోట రోడ్డు పక్కగా ఒక చిన్న గుడి దగ్గర "ఇరుక్కు పిళ్ళై యార్" అని ఒక చిన్న గుడి వుంటుంది. అక్కడ స్వామి వారి పాదాలు వుంటాయి. ఒక చిన్న ద్వారంలాగా వుంటుంది. అక్కడ ఆ సన్నని ద్వారం నుండి దూరివస్తే కష్టాలు దూరం అవుతాయి అంటారు. నా బెల్ట్ పెద్దది:). పెట్టుకున్నబెల్టు వదిలేసినా బాడీ వదిలేయ లేము కదండీ. దూరుతుంటే ఇరుకుంటానేమో అనిపించింది. ఎలాగో బానే వచ్చేసాను అనుకోండి మొత్తానికి :). ఇరుక్కు పిళ్ళై యార్ ఇక్కడ చూడండి.
వదులు ఐన దుస్తులు వేసుకోండి. చిల్లర బాగా తీసుకెల్లండి. ఎన్నో గుడులు, సన్యాసులు ఎంతో మంది కనపడతారు.
తోలు వస్తువులు బెల్టు, పర్సు లాంటివి దయచేసి రూం లోనే వుంచేయ్యండి. అనవసర పాపాన్ని కలగచెస్తై. ఒక పెన్ను కూడా ప్రదక్షిణ చేస్తుంటే బరువుగా అనిపిస్తుంది మరి :).
మూత్రశాలలు అవీ రాత్రి పూట మూసివేసి వున్నాయి. పౌర్ణమి రోజులలో మాత్రం రాత్రిపూట ఉంటాయి అని వినికిడి. కొంచెం ఇబ్బంది అనిపించింది. సూర్యోదయ పూర్వం గిరి ప్రదక్షిణ పెట్టుకోవటం ఉత్తమం అనిపించింది.
గిరి ప్రదక్షిణలో దారి తెలియకపోతే "గిరి వలయ" అని అడగండి చాలు ! ఎవరైనా దారి చెప్తారు.
చెప్పులు, షూ లాంటివి అస్సలు వేసుకోవద్దు. వట్టి పాదాలతోనే చెయ్యండి. ఆటోవాళ్ళు అడుగుతారు ప్రదక్షిణ ఆటో కావాలా అని. ఇలాంటి షార్ట్ కట్ పద్దతులు వద్దు. మన చిత్తశుద్ధి, భక్తీ నమ్మి అడుగేయ్యటమే ఆ తరువాత ఆయన మేజిక్ చూస్తారు :)
భగవత్ భక్తి మొదటి ప్రాధాన్యత అని అనుకుంటే, ఎలాంటి ఆటంకం వచ్చినా అధిగమిస్తాము. ఇది అనుభవపూర్వైక సత్యం.
ఆఖరుగా నామ స్మరణ మాత్రం వదలద్దు అది ప్రాణవాయువు. ఎలాంటి ఆపద వచ్చిన తొలగించి మీకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. వెన్నంటి కాపాడుతుంది.
చాళుక్య ఎక్ష్ప్రెస్సు (11006) తిరువణ్ణామలై రైల్వే స్టేషన్ లో 2 నిమిషాలు మాత్రమే ఆగుతుంది గమనించగలరు. బెంగళూరు కే.ఆర్. పురం లో ప్రొద్దునే 4.30AM కి దిగుతారు లేట్ లేకపోతె. సిటీ జంక్షన్లో ఐతే 6 అవుతుంది.
ఒక మంచి వీడియో క్లుప్తంగా కానీ, బాగా వివరించారు. మీరు కూడా చూడండి.
(ఈ బ్లాగ్ నుంచి)
రాజా చంద్ర గారు అత్యంత విలువైన సమగ్రమైన సమాచారం ఇచ్చారు. మాకే కాదు అందరికి కూడా ఉపయోగపడుతుంది అని కింద లంకెలు ఇస్తున్నాను,
http://www.templeinformation.in/2012/02/blog-post.html
http://www.templeinformation.in/2013/10/tiruvannamalai-girivalam.html
తిరువణ్ణామలై ఆలయ విశేషాలు, గొప్పతనం ఇతర విషయాలు గురించి ఇప్పటికే నెట్ లో విసృతంగా సమాచారం వుంది. కావున లంకెలు ఇస్తున్నాను. ఒకసారి చూసి మిగతా చదవండి.
లంకె 1
లంకె 2
లంకె 3
లంకె 4
లంకె 5
లంకె 6
అరుణాచలం లేదా తిరువణ్ణామలై గురించి చెప్పగానే రెండు విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఒకటి రమణ మహర్షి, రెండు అరుణ గిరి. బ్రహ్మ, విష్ణు ఎవరు గొప్ప అని కలహించు కుంటే మధ్యలో ఒక ఆది, అంతం లేని తేజో లింగ ఆవిర్భావ కథ విన్నారు కదా ! అది ఇక్కడిదే.
హొయసల రాజైన మూడవ వీర భళ్ళాలుని భక్తిని గురించి ఈ సందర్భంలో ఒకసారి స్మరించాలి. అరుణాచలేశ్వరుడు ఒకసారి తన భక్తి పరీక్షింపగోరి జంగమ దేవర వేషంలో విచ్చేసి, దేవదాసి సేవకి ఏర్పాట్లు చెయ్యమన్నాడు. జంగమ దేవరకు తప్ప దాసీ అందరికీ దొరికారు. దాంతో రాజు రెండవ భార్య ఐన రాణి చల్లమా దేవి తానే, దాసి సేవకై జంగమ దేవర మందిరంలో ప్రవేశించి జంగమ దేవరని తాకగానే, జంగమ దేవర పసిపిల్లవాడిగా మారిపోయి, పిల్లలు లేని ఆ రాజదంపతులను కాసేపు అలరించాడు. అశరీరవాణి, ఓ రాజా ! పిల్లలు లేని నీకు ఆ లోటును తీర్చటానికి పిల్లవాడినై అలరించాను. నీకు ఇక లోటేం వుండదు. నీ శ్రాద్ధాన్ని నేను నిర్వహిస్తాను అని అపీతకుచాంబా సమేతుడై, నంది వాహనరూఢుడై . అరుణాచలేశ్వరుడు దర్శన మిచ్చాడు. దీనికి రుజువుగా ఇప్పటికీ అరుణాచలేశ్వరుడు యజమానిగా ఫిబ్రవరి మాసంలో రాజుకు యదావిధిగా శ్రాద్ధం నిర్వహిస్తారు.
(గురు - గిరి - గుడి (శ్రీ రమణాశ్రమం వారి గైడు నుంచి)
భగవాన్ శ్రీ రమణులు 16 వ యేటన ఆత్మజ్ఞానం పొంది 54 సంవత్సరాల తమ నిర్యాణ పర్యంతమ్ ఇక్కడే నివసించారు.
శాక్తవులు ఈ గిరిని 43 కొణాలున్న శ్రీ చక్ర మేరువుగా దర్శిస్తే, ఆది శంకరులు మేరు గిరిగా వర్ణించారు. వైష్ణవులు ఈ గిరిని సుదర్శన చక్రమని విశ్వసిస్తారు.
ఇక మా యాత్రకొస్తే, చిన్న చిన్న సమస్యలు రానే వచ్చాయి. మేము దిగవలసిన చోటుకి కాకుండా బస్సు వాడు 90 కిలోమీటర్లు దాటిపోవటం, వచ్చేటప్పుడు 2 గంటలు పైన ట్రైన్ ఆలస్యంగా రావటం వంటివి వున్నా పరమశివుని మదిలో పెట్టుకున్నందున ఇవేవీ పెద్దగా బాధించలేదు. మేము చేసిన సత్కర్మలు, మమ్మలిని వెనకకు లాగే దుష్కర్మలను శమింపచేసాయి అనుకున్నాము. ఐనా ఇప్పుడు ఆలోచిస్తుంటే మేము ఆ వేళ, అలా దాటిపోకుంటే అస్సలు ప్రదక్షిణ చేయ్యగలిగే వాళ్ళమా అనిపిస్తుంది. గుడి దర్శనం అయ్యేసరికే 10 దాటిపోతే ఇంకా ప్రదక్షిణ కనీసం 4 గంటలు తక్కువకాదు. అంత మండుటెండలో అది సాధ్యమయ్యేపనికాదు కూడా.
స్మరణాత్ ముక్తినొసగే క్షేత్రం అరుణాచలం. ఆలయం బస్సు స్టాండ్ నుంచి ఒక అర్ధ కిలోమీటరు వుంటుంది. రమణాశ్రయం, ఆలయం మీదుగా 3 కిలోమీటర్లు. ఇక్కడ తమిళులు మిగత చోట్ల కాకుండా కొంచెం తెలుగులో, ఇంగ్లీష్ లోనో మాట్లాడుతూ, దారి చెప్పి సహాయం చేసారు. తెలుగు వాళ్ళు కూడా అక్కడ అక్కడ కనపడ్డారు.
దేవాలయానికి అభిముఖముగా నుంచుంటే, కుడిపక్కగా ఒక ఫలహారశాల, ఆ పక్కనే చిన్న పుస్తకాలు షాపు కనపడతాయి. మేము అక్కడే రూం తీసుకున్నాము. ఇద్దరికి సరిపోయేలాగా వుంది. 300 రూపాయలు ఒక రోజుకి బాడుగ అని చెప్పారు. ఆ పుస్తకాల షాపు మరియు ఓనర్ అనుకుంట తను, కొంచెం యాత్రికులకు సహాయం చేసే గుణంగా కనిపించింది. తెలుగు పుస్తకాల కోసం అడిగితే ఆ పక్కనే రెండు భవనాల పక్కన ఇంకో షాపు చూపించాడు. అక్కడ అరుణాచల మహాత్మ్యం, గురు-గిరి-గుడి గైడు కొన్నాము. గిరి వలయ మ్యాప్పు, ఆలయం మ్యాప్పు రెండూ కూడా అరుణాచల మహాత్మ్యం పుస్తకం లో వున్నవి. ఐతే ఆలయంలోకి తీసుకుని వెళ్ళలేదు. జనం కొంచెం పల్చగానే వున్నారు. మొత్తం మీద రెండు గంటలు పైన పట్టింది. చాలా ఉపాలయాలు వున్నాయి. కోనేరు తలుపులు వేసి వున్నాయి. విశాయలమైన గోపురాలు, ఆలయ సముదాయాలు, వందల వేల సంవత్సరాల తరువాత కూడా ఇంత జనాభాకు సరిపోతున్నాయి అంటే అప్పటి ఆలోచనలకూ, మేధస్సుకు వహ్! అనిపిస్తుంది.
అయ్యవారి దర్శనం అమ్మవారి దర్శనం బాగా జరిగింది. అయ్యవారి దర్శనమప్పుడు గర్బాలయం లో అగ్ని లింగం కాబట్టి అక్కడ దగ్గరగా వుంటే విపరీతమైన వేడి అనుభూతితో చెమటలు కక్కుతాము అని ప్రతీతి. అలా విన్నపుడు మనకు అలాంటి అనుభవం కలిగితే బావుండును అనిపిస్తుంది కదా ? నాకు నా అర్హతకు అలాంటిదే ఒకటి అనుభవం లోకి వచ్చింది. సరిగ్గా అయ్యగారి ముందుకు వచ్చేసరికి, దీప సెగ మాములు కంటే ఎక్కువగా హారతి సమయంలో తాకినట్లు అనుభూతి కి లోనయ్యాను. స్వామి తేజో లింగం కాబట్టి గర్భగుడి దర్శనంలా కాకుండా ఇలా అనుగ్రహించాడు అనుకున్నాను :).
ఇక్కడ ఉచిత ప్రసాదం లేదు కాబోలు, వెల వుంది. పులిహోర, ఇతర ప్రసాదాలు వున్నాయి. ఎంత కొంచెం ఐనా వచ్చిన ప్రతీ భక్తునికి స్వామి వారి ఉచిత ప్రసాదం ఏర్పాటు చేసి వుంటే బావుండును అనిపించింది.
ఆలయం లోపల దేవస్తానం వారిదో మరి ఎవరిదో ఒక ఏనుగు వుంది. చిల్లర ఇస్తుంటే తొండంతో ఆశీర్వాదం ఇస్తుంది. పిల్లలు అక్కడ గుమిగూడి కొంచెం సరదాగా వుంది.
రమణ మహర్షి తపస్సు చేసిన పాతాళ గుహాలయం అక్కడే వుంది. ఆలయ దర్శనం ఐపోయిన తరువాత బసకు వచ్చి కొంచెం సేద తీరి, గుడి ముందే ఆంధ్ర మెస్ అని వుంటే అక్కడ భోజం చేసాము. వాళ్ళది గుంటూరు అని తెలిసింది వున్నతలో అడిగి బాగా పెట్టారు :).
ఇక ప్రదక్షిణ కొస్తే సాయత్రం 4 దాటినా తరువాత గుడి బయట దండం పెట్టుకుని బయలుదేరాము. కొద్దిగా ఎండ వుంది. కాళ్ళు కాలతున్నాయి. అష్ట లింగాలలో మొదటి లింగం గుడి ముందే వుంది అని తరువాత తెలిసింది. మేము అది తప్ప మిగతా అన్ని లింగాల దర్శనం చేసుకున్నట్టు గుర్తు. ఇంకా ప్రదక్షిణ ముందుకు చేసేకొద్దీ శ్రమ, భక్తీ, అలసట, భగవంతునిపై నమ్మకం పరీక్షలా అనుభవంలోకి రాసాగింది.
"అరుణాచల శివ" "అరుణాచల శివ" వెంటిలేటరు మీద వూపిరిలూదుతున్నట్టు నామజపమే శ్వాసగా, ప్రాణంగా, నమ్మకమే విశ్వాసంగా ముందుకు నడిచాము. అస్సలు మా వల్ల అవుతుందో లేదో, చెయ్యగలమో లేదో మా కర్మ మమ్మలిని వెనుకకు లాగుతుందేమో అని ప్రదక్షిణ చివరి అడుగు పూర్తిచేసేవరకూ కూడా మనసులో ఏదో ఒక మూల చిన్న సంశయం, భయం, వీటిని అధిగమించే అయన మీద భక్తీ.
భగవంతుని నమ్మి ముందుకు నడిచేవాడికి ఆలస్యం అవుతుంది ఏమోకాని ఓడిపోవటం అనేది జరగని విషయం అంటుంటారు. అది మరొకసారి అనుభవం లోకి వచ్చింది ఈ యాత్ర తో.
ప్రదక్షిణ చేసే వాళ్ళు గమనించ వలసిన విషయాలు:
----------------------------------------------------
ప్రదక్షిణ ప్రియాయ నమః అని అష్టోత్తర నామం ఒకసారి గుర్తు చేసుకోండి :).
అరుణాచలేశ్వరుడు, అమ్మవారిని దర్శించుకునే గుడి సమయం, గిరి వలయ ప్రదక్షిణం ఒక్కేసమయం లో చెయ్యకుండా చూసుకోండి. ఎందుకంటే గుడిలో దాదాపు రెండు గంటల సమయం పైన పడుతుంది. మళ్లీ గిరిప్రదక్షిణ 14 కిలోమీటర్లు పడుతుంది. అలానే గిరిప్రదక్షిణ మార్గంలో రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. అక్కడ ఆశ్రమం మొత్తం చూడాలంటే టైం పడుతుంది. మాకు మొత్తం 5 గంటలు దాకా పట్టేసింది. మాములుగా ఒక్క గిరిప్రదక్షిణ అంటే మూడు గంటల దాకా పడుతుంది. మనం ముఖ్య ఆలయాలు మాత్రమే చూసుకుంటూ పోతె 4 గంటలు పట్టవచ్చు. దాదాపు పెద్ద ఆలయాలు, ప్రముఖ ఆలయాలు అన్ని రహదారికిరు పక్కన వుండటం వల్ల అంత సమస్య వుండదు. అన్ని చూడాలి అంటే ఒకటి నుండి నాలుగు రోజులు పడుతుంది అని పుస్తకం లో చదివాము.
ఆడవారు వంటరిగా చెయ్యవద్దు. తోడుగా తప్పనిసరిగా ఎవరినో ఒకిరిని తీసుకువెళ్ళండి.
పున్నమి రొజులలో లక్ష మంది ప్రదక్షిణ చేస్తారని చెప్తారు. రోడ్ పైన నడవటానికే చోటు లేనంతగా.
రోడ్డుకి ఎడమ వైపునే నడవ్వాలి. ఇది మాకు తెలిసిన విషయమే అని అంటారా ? ఆగండాగండి, ఇది రహదారి భద్రతా కోణం కాదు. అనవసర దేవా, సిద్దపురుష శాపానికి గురికాకుండా. అవును గిరి ప్రదక్షిణ మార్గంలో కుడి పక్కన దేవా, సిద్ధ, రుషి పుంగవులు అదృశ్య రూపంలో ప్రదక్షిణ చేస్తారని ప్రతీతి.
రోడ్డుకి ఎడమ పక్కన నడవటానికి వీలుగా ఫూట్ పాత్ నిర్మించారు. దాని మీద నడవండి సాధ్యమైనంత వరకు.
మనం ఆఖరుగా సిటీలోకి వచేస్తాము అనుకుంటుండగా ప్రధాన రహదారికి ఎడమ పక్కగా ఒక చిన్న రోడ్ వుంటుంది. అక్కడ ఆఖరు ముఖ్య ఆలయం ఈశాన్య లింగం వుంటుంది. ఇక్కడే ఎడమపక్క స్మశానం వుంటుంది. అక్కడ దండలు రోడ్ మీద వేసేస్తున్నారు. అక్కడ చూసుకుంటూ వెళ్ళటం కొంచెం బాధ అనిపిస్తుంది. ఐతే రోడ్ కి అక్కడ మాత్రం కుడి పక్కన ఫుట్ పాత్ వుంటుంది. ప్రదక్షిణ నియమములో కుడి వైపు దేవతా సంచారం వుంటుంది అన్న నియమం గుర్తుకు వచ్చి, ఫుట్ పాత్ ఉన్నాగాని ఎలాగో దారి చూసుకుని తొక్కకుండా ఈశాన్య లింగ దర్శనం కూడా చేసుకున్నా :).
ఇక్కడ ఒకచోట రోడ్డు పక్కగా ఒక చిన్న గుడి దగ్గర "ఇరుక్కు పిళ్ళై యార్" అని ఒక చిన్న గుడి వుంటుంది. అక్కడ స్వామి వారి పాదాలు వుంటాయి. ఒక చిన్న ద్వారంలాగా వుంటుంది. అక్కడ ఆ సన్నని ద్వారం నుండి దూరివస్తే కష్టాలు దూరం అవుతాయి అంటారు. నా బెల్ట్ పెద్దది:). పెట్టుకున్నబెల్టు వదిలేసినా బాడీ వదిలేయ లేము కదండీ. దూరుతుంటే ఇరుకుంటానేమో అనిపించింది. ఎలాగో బానే వచ్చేసాను అనుకోండి మొత్తానికి :). ఇరుక్కు పిళ్ళై యార్ ఇక్కడ చూడండి.
వదులు ఐన దుస్తులు వేసుకోండి. చిల్లర బాగా తీసుకెల్లండి. ఎన్నో గుడులు, సన్యాసులు ఎంతో మంది కనపడతారు.
తోలు వస్తువులు బెల్టు, పర్సు లాంటివి దయచేసి రూం లోనే వుంచేయ్యండి. అనవసర పాపాన్ని కలగచెస్తై. ఒక పెన్ను కూడా ప్రదక్షిణ చేస్తుంటే బరువుగా అనిపిస్తుంది మరి :).
మూత్రశాలలు అవీ రాత్రి పూట మూసివేసి వున్నాయి. పౌర్ణమి రోజులలో మాత్రం రాత్రిపూట ఉంటాయి అని వినికిడి. కొంచెం ఇబ్బంది అనిపించింది. సూర్యోదయ పూర్వం గిరి ప్రదక్షిణ పెట్టుకోవటం ఉత్తమం అనిపించింది.
గిరి ప్రదక్షిణలో దారి తెలియకపోతే "గిరి వలయ" అని అడగండి చాలు ! ఎవరైనా దారి చెప్తారు.
చెప్పులు, షూ లాంటివి అస్సలు వేసుకోవద్దు. వట్టి పాదాలతోనే చెయ్యండి. ఆటోవాళ్ళు అడుగుతారు ప్రదక్షిణ ఆటో కావాలా అని. ఇలాంటి షార్ట్ కట్ పద్దతులు వద్దు. మన చిత్తశుద్ధి, భక్తీ నమ్మి అడుగేయ్యటమే ఆ తరువాత ఆయన మేజిక్ చూస్తారు :)
భగవత్ భక్తి మొదటి ప్రాధాన్యత అని అనుకుంటే, ఎలాంటి ఆటంకం వచ్చినా అధిగమిస్తాము. ఇది అనుభవపూర్వైక సత్యం.
ఆఖరుగా నామ స్మరణ మాత్రం వదలద్దు అది ప్రాణవాయువు. ఎలాంటి ఆపద వచ్చిన తొలగించి మీకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. వెన్నంటి కాపాడుతుంది.
చాళుక్య ఎక్ష్ప్రెస్సు (11006) తిరువణ్ణామలై రైల్వే స్టేషన్ లో 2 నిమిషాలు మాత్రమే ఆగుతుంది గమనించగలరు. బెంగళూరు కే.ఆర్. పురం లో ప్రొద్దునే 4.30AM కి దిగుతారు లేట్ లేకపోతె. సిటీ జంక్షన్లో ఐతే 6 అవుతుంది.
ఒక మంచి వీడియో క్లుప్తంగా కానీ, బాగా వివరించారు. మీరు కూడా చూడండి.
No comments:
Post a Comment