అదిగదిగో భద్రాద్రి ! అందుకోండి నా రామచంద్రుని ఆశీస్సులు (భద్రాద్రి రామచంద్రుడి దర్శనభాగ్యం).
మా చిన్నప్పుడు ఊరూరా రామాలయాలు, ఊరి చివర నేనున్నా అంటూ గ్రామాన్ని రక్షకుడిలాగా వుండే హనుమాన్ విగ్రహాలు ప్రతి వూరిలోను కనిపించేవి.
శనివారం వచ్చిందంటే గుళ్లో భోగం అంటూ ఊరంతా ఒకే చోట చేరటం, సందడి చెయ్యటం, తులసి తీర్థం తీసుకోవటం, పూజ ఎపుడు అవుతుందా, పులిహోర ప్రసాదం ఎపుడు పెడతారా అని పిల్లలంతా ఎదురు చూడటం. ఆ వారానికి వూరి వారు ఎవరో ఒకరు ప్రసాద వితరణ చెయ్యటం. ఆరోజుల్లో గుడినుంచి బయటకు వచ్చేటప్పుడు కాసేపు కూర్చోటం అనేదానికి ఒక అర్థం కనిపించేది.
ఒక సంవత్సరం ముందు మళ్ళీ ఆ వూరు వెళ్ళినప్పుడు ఆ వైభవం అంతా గుర్తుకొచ్చింది.
గూటీబిళ్ళ ఆడుతూ భగవత్ గీత వినటం
----------------------------------------------------
చెప్పటానికి నవ్వొస్తున్నా, కొంచెం సిగ్గుగా కూడా వుంది. మైకులో రోజూ వచ్చే భగవత్ గీత, శ్రీ రామ నామామృతం పాటలు మా పిల్లలకి ఆ గుడి దగ్గర్లోనే ఆడుకోవటం వల్ల దాదాపు నోటికి వచ్చేసేవి. కోరస్ పాడుతూ ఆడుకునేవాళ్ళం :). సైకులు తొక్కుతున్నా, గూటి బిళ్ళ ఆడుతున్నా ఒక పక్క పాడుతూనే, హమ్ చేస్తూనే ఉండేవాళ్ళం. లేకపోతె అల్లరిగా మేమూ పాడేవాళ్ళం (ఆ పుణ్యమేమో ఇంకా పైకి పోకుండా చాలాసార్లు కాపాడింది :p).
ఇప్పుడు ఆ వైభవం అంతా పోయింది. ప్రతి విషయానికి కొలబద్ద డబ్బు మాత్రమే. కంప్యూటర్ జనరేషన్ పిల్లలు అని మురిసిపోవటమే. ఇప్పుడు ఇదొక్కటి తెలిస్తే అప్పటి పిల్లలకి జీవితం తెలుసు అంతే తేడా. తేడా అడిగారు అంటే మీరు కంప్యూటర్ జనరేషన్ కిడ్ అని అర్థం :)).
మొట్టమొదటి డాబా ఇల్లు మా మావయ్య వాళ్లది కావటం చేత డాబావారి ఇల్లు అని పిలిచేవారు.
ఇప్పుడు ఇద్దరు మావయ్యలు పోయాక, ఎవరు ఉండక తాళాలు వేసి వున్నాయి. పెద్ద పాలస్ లాంటిది పాడుబడుతుంది ఇప్పుడు.
రామాలయాలు స్థానంలో ఏవేవో వచ్చి ఆ ఆలయాలకు ఆదరణ కరువైపోయింది. చెప్పటం కూడా చాలా కష్టంగా వుంది.
దేశంలోనే రెండో పాడురంగని ఆలయంగా పేరుగాంచిన చిలకలపూడి (మచిలీపట్టణం) పాండురంగని ఆలయ దర్శనానికి వెళ్ళినపుడు, పూజారి గారు ఎక్కడ నుంచి వచ్చారు అమ్మా ! అని అడిగితె, బెంగళూరు అని చెప్పాము. అప్పుడు ఆయన, వున్న వూళ్ళోనే ఎవరూ పట్టించుకోవటం లేదు. మీరు అక్కడినుంచి దర్శనానికి వచ్చారా ! అని నిర్లిప్తంతో కూడిన మనసులోని మాటలు బయటకి వినపడటం ఇప్పటికీ గుర్తు వుంది.
ఏం చేస్తాం దేవుడు ఆలయాలని, భక్తిని, ఐతే సిలబస్ లో పెట్టాలి. లేకపోతె బ్రాండ్ మేనేజర్ ని ఒకడిని పెట్టుకోవాలి. కాదు, కూడదు అంటే 'వివాదమో లేక సంచలనమో' చెయ్యాలి.
మా వూళ్ళో నే కాదు. చాలా పల్లెటూళ్లలో అదే పరిస్థితి. రకరకాల దేవతలు, దేవుళ్ళు.. సాత్విక దేవతలతో పాటు, ఉగ్రరూప దేవతలు వచ్చేసారు.
శివాష్టోత్తర శతనామ స్తోత్రం అంటే రెండు నిముషాలు టైం కేటాయించటం అని చెబుతున్నారు. మనసొక చోట, తనువొక చోట. రెండు చేతులు జోడించడం అంటే ఏంటో తెలియదు. తెలిసినా మనసుకి అనుభూతిలో ఓలలాడదు. అంతా యాంత్రికం. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద (అయ్యో ! మావి బ్రాన్డెడ్ చెప్పులండి బాబు, పొతే ఎలాగ అంటారా ! ఐతే సరి ఇంక ఆ భగవంతుడే కాపాడాలి అని కోరుకోవటమే :(.
"శివో" అంటూ శివాష్టోత్తరం మొదలుపెట్టే మనం ఆ నామానికి అర్థం కనీసం మంగళకరం, మంగళాలు ఇచ్చేవాడు అని జ్ఞప్తికి ముఖ్యంగా అనుభూతికి తెచ్చుకుంటున్నామా ? ఎవరికి వారు ఆలోచించుకోవాలి ఇది ...?
పిండికొద్దీ రొట్టె అని అంటారు. అలా చేసే పూజా ఫలితాలు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోకపోవటమే మంచింది.
ఒక్కసారి, ఒక్క నామముతో మొదలెట్టండి. అర్థాన్ని అనుభూతిలోకి, అనుభంలోకి తెచ్చుకోండి. అద్భుతాలు చూస్తారు. శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు లాంటి పెద్ద ఎందుకు అన్ని సార్లు ఈ విషయాన్ని పదే, పదే చెబుతారో అప్పుడు అర్థం అవుతుంది.
సారీ డైవర్ట్ (?) అయ్యాను. మన యాత్ర లోకి వెళ్ళిపోదాం.
మా ఊరినుంచి భద్రాచలం సుమారు నూటపది కిలోమీటర్లు. బండి మీద వెళ్ళేటంత తక్కువ దూరం కాదు. అలా అని మరీ అసంభవం అనేటంత ఎక్కువా కాదు. ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల, మా వాళ్ల మిగతా కారణాల వల్లను, ఇద్దరం కలిసి బస్సు లో వెళితే, మరొకడు బండి మీద వచ్చాడు.
పొద్దుటే టీ, కాఫీలు తాగకపోతే పడిపోయే శరీరాలు కదా ! అందుకే బ్రేక్ జర్నీ చేసుకుంటూ వచ్చే దారిలో అల్పాహారం చేసుకుని భద్రాద్రి చేరుకున్నాము.
ముందుగా భద్రాద్రి చేరుకున్నాక సరాసరి గోదావరి ఘాట్ దగ్గరకి వెళ్ళాము. సరాసరి నదిలో స్నానం ఇష్టం లేక ఆ పక్కన వున్న టాయిలెట్స్ లో స్నానాదులు ముగించుకుని ఆలాగే సరాసరి తడిబట్టలతోనే నదీ స్నానం (నదీ స్నాన శ్లోకంతో సహా) కూడా ముగించుకుని ఆలయానికి బయలుదేరాము.
ఎపుడో డిగ్రీ చదువుకునేటప్పుడు వెళ్లిన పిక్నిక్ లో భాగంగా వచ్చేటపుడు దర్శనం చేసుకున్నాము అని స్నేహితుడు గుర్తు చేసాడు. అప్పటికి, ఇప్పటికి మొత్తం మారిపోయింది.
ఇక్కడ ఒక చిన్న విషయం మనవి చేసుకోవాలి. జనాభాపెరగటంతో పాటు భక్తులు కూడా రోజురోజుకి పెరుగుతున్నారు. అభివృద్ధి ఆవశ్యనీయం. అభివృద్ధి జరుగుతున్న సమయంలో మాత్రం ఆలయాన్ని దర్శించినప్పుడు మనసు చివుక్కుమంటుంది.
మొన్న మధ్య మా వాడు విజయవాడ టెంపుల్ దగ్గర దిగిన ఫోటో పంపిస్తే, ఎక్కడ అని అడిగానంటే పరిస్థితి అర్థం చేసుకోండి.
విజయవాడ అదే మన బెజవాడ కనకదుర్గ 'పెద్దమ్మ'ని ని చూడటానికి నేను కూడా వెళ్ళాను ఆ మధ్య . అక్కడ అమ్మవారి దర్శనం అయ్యాక, మల్లేశ్వర స్వామి దర్శనంకి వెళదామనుకుంటే బారికేడ్లు దర్శనమిచ్చాయి. దర్శనం లేదు అన్నారు. అంతకు ముందు కొత్తగా నటరాజస్వామి ఆలయం దగ్గర ఒక శివలింగం కనపడింది. పూజారి గారు తీర్థం ఇస్తున్నారు. కొత్త ఆలయం ఏమైనా పెట్టారా అనుకుంటూ అన్యమనస్కంగా తీర్థం తీసుకున్నా. కానీ తాత్కాలిక మల్లేశ్వర స్వామి అని తరువాత తెలిసింది.
రైల్ ఎక్కాలన్న తొందరలో వున్నానేమో అస్సలు ఆరు ఫ్లోర్లు ఎక్కడానికే అతి కష్టం అయింది. స్పెషల్ దర్శన్ టిక్కెట్ల రేట్లు చాలా పెంచేశారు. ఇందాక చెప్పినట్టు అభివృద్ధి అవసరమే కానీ ఎంత మూల్యానికి అన్నట్టు, ప్రాణప్రతిష్ట చేసిన, అత్యంత పురాతన వైభవం, మహాత్మ్యం కలిగిన గుడులను రాత్రికి రాత్రి లేపేస్తే అర్థం ఏమిటి ? ఎంత దారుణమైన ఫలితాలు వుంటాయో తెలియదా ? ఊహించడానికే భయం వేస్తుంది. యాథా రాజా ! తథా ప్రజా ! ఇలాంటివి చేస్తే మంచోడు, చెడ్డోడు అందరూ పోతారు అంతే సింపుల్. చేసినందుకు వాడు, అడగనందుకు వీడు.
కామేశ్వర శర్మ గారు అనుకుంట. కొన్ని సంవత్సరాలకు ముందు అత్యంత పురాతన, ప్రభాన్వితమైన మరియు వివిధ పురాణాలలో పేర్కొనబడిన ఆలయ నీటి కుండాలను పూడ్చి వాటి పైన లెట్రిన్స్ కట్టారు అని ఆ అర్చక స్వామి అత్యంత ఆవేదనతో ఒక పుస్తకం కూడా రాశారు.
ఇలాంటి విషయాలలో శాస్త్రోత్తంగా - ఆగమశాస్త్రాలో లేక మరొకటో, వేద పండితులు,పెద్దలు, అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్ళాలి. అంతే కానీ ప్రోక్లేన్లు, క్రేన్లు వంటి యంత్రాలో లేకపోతె బి.టెక్లు, ఎం.టెక్లు, 'బేక్ లాగులతో' పాస్ అయిన ఇంజినీర్ల సలహాలతో కాదు.
ఎటుపోయాము. సరే ఇప్పుడు వెనక్కి రండి, మన భద్రాద్రి యాత్ర లోకి.
మేము సుమారు 12 గంటల సమయంలో ఆలయంలోకి ప్రవేశించాము. భద్రాద్రి స్వామి పరివారసమేతంగా దర్శనమిచ్చాడు. ఆలయ దర్శన బ్రేక్ సమయం అనుకుంట. కంగారు పడుతున్నారు అందరూ.
మొత్తానికి మా దర్శనం అయింది. బ్రేక్ లోపు మేమే ఆఖరు దర్శనం అనుకున్నాము. ఆరోజు అమావాస్య . అమావాస్య రోజు ఎందుకు ప్రయాణాలు పెట్టుకోరో అనుభవ పూర్వకంగా అర్థం అయింది. తరువాత చెప్తాను. కాని ఏం చేస్తాము సమయం అట్టే లేదు. పరిస్థితులేమో పగబట్టాయి ఇంతకుముందు కూడా రకరకాల కారణాలతో వాయిదా పడింది. అందుకే దేవుడు పిలిస్తే ఇంక పరిగెత్తటమే. ఆలోచించకూడదు అనిపించి బయలుదేరాము.
గుడి మెట్లు ఎక్కేటప్పుడు కొన్ని వుపాలయాలు కనపడ్డాయి. సర్లే మళ్ళీ చూసుకుందామని పైకొచ్చేసాము. అక్కడ శాశ్వత సేవలు కూడా ఉన్నట్టు కనపడ్డాయి. తోచినంతమేర మొత్తం స్వామి అనుగ్రహం మేరకు ఆయన సేవకు రాయించాము. ఈ శరీరం వున్నా, పడిపోయిన, ఉత్తరోత్తర జన్మలు వున్నా, లేకపోయిన, ఆ జన్మలలో భక్తి వున్నా, లేకపోయిన శాశ్వతంగా భగవంతుని కైంకర్యం జరుగుతుంది.
శాశ్వత సేవలు అంటే నా దృష్టిలో మన శరీర ప్రయాణం ఇక్కడ ఆగినా, సాధనా ప్రయాణం కొనసాగించటమే !!!.
మీకో విషయం చెప్పాలి ముందు. మీకు రామ గుండిగ, లక్ష్మణ గుండిగ చరిత్ర తెలుసా ! ఇక్కడి అంబా సత్రం గురించి కూడా విన్నారా ? ఐతే ఇక్కడ చదవండి ముందు.
సరే అసలు భద్రాద్రి క్షేత్ర వైభవం గురించి ఒకటి రెండు మాటలు (అంతర్జాలం నుంచి)
మేనకా, హిమవంతుల పుత్రుడు భద్రుడు. భద్రుడు చేసిన తపస్సుకు మెచ్చి వరప్రధానంగా స్వామి సరాసరి వైకుంఠం నుంచి వచ్చి భద్రుడు కొండ రూపం దాల్చితే స్వామి ఆసీనులయ్యారు. అందుకే ఇది భద్రాద్రి & భద్ర+అచలం = భద్రాచలం అయింది.
ఇక్కడ స్వామి తొడ మీద అమ్మవారు ఆసీనులై దర్శనమిస్తారు. మనం చదువుకున్న కంచర్ల గోపన్న - అదే స్వామి మహా భక్తుడుగా పేరుగాంచిన శ్రీ రామదాసు. గుడి కట్టించినందుకు చెరసాలలో వెయ్యబడ్డాడు కదా తానీషా ప్రభువు చేత. ఆ రామచంద్ర ప్రభువే అప్పు చెల్లించి మరీ రామదాసుని అనుగ్రహించిన కథ మనకందరికీ తెలిసిందే కదా ! దాశరథి శతకం రాసింది కూడా ఈ రామదాసే మరి.
స్వామి వారి మరొక మహాభక్తుడు కబీర్. కబీర్ నకు ఆలయ ప్రవేశం నిరాకరిస్తే, అక్కడ దివ్య చిత్రాలు మాయమయ్యాయట. మళ్ళీ కబీర్ నాకు దర్శనానికి అనుమతించిన మీదటనే అవి ప్రత్యక్షమయ్యాయట.
సాధారణ రామాలయాలలోలాగ కాకుండా స్వామి ఇక్కడ నాలుగు చేతులతో శంఖ,చక్ర, ధనుర్భాణాలతో దర్శన మివ్వటానికి కారణం స్వామి వైకుంఠం నుండి సరాసరి దిగిరావటమే స్థలపురాణం చెబుతుంది. అందుకే ఇక్కడ స్వామిని వైకుంఠ రాముడుగా పిలుస్తారు. ఇక్కడ వైకుంఠ ఏకాదశికి, ఉత్తర ద్వార దర్శనానికి కూడా అంత ప్రాధాన్యం అందుచేతనే.
ఇక్కడ మన స్వామి సీతా, లక్ష్మణ సమేతుడై రామాయణ వనవాసకాలంలో నివసించిన ప్రదేశం పేరు పర్ణశాల. ఇక్కడే సీతమ్మ తల్లిని, రావణుడు మాయా వేషంలో అపహరించినది. అక్కడ గుర్తులు కూడా చూపిస్తారు. భద్రాద్రి వచ్చిన ప్రతివారూ పర్ణశాల కూడా చూసుకుని వెళతారు. ఈ మధ్య 'అభివృద్ధి' దెబ్బ ఇక్కడ కూడా పడింది. అక్కడ అంత పెద్దగా ఏమి లేదు ఇప్పుడు అని మరొక స్నేహితుడు చెప్పాడు. ఐతే అంతకు ముందు వెళ్ళటం వల్లను, సమయాభావం వల్లను మా స్నేహితుడు కొత్తగా ఏమీ లేదు అని చెప్పి ఉండవచ్చు. ఈ ట్రిప్ లో ఐతే పర్ణశాల వెళ్ళలేదు. భద్రాచలం నుంచి పర్ణశాల 35 కిలోమీటర్లు దూరం.
చెప్పటం మరిచిపోయాను. మీరు ప్రత్యేకంగా ఉండాలి మీ జర్నీ అనుకుంటే పోలవరం నుంచో, రాజముండ్రి నుంచో లాంచీ లో వెళ్ళండి గోదావరి అందాలు చూసుకుంటా. పాపికొండలు (పాపిడి కొండలు) ప్యాకేజీలు ఉంటాయి. ఏ.పీ.టీ.డి.సి. వాళ్ళను కూడా సంప్రదించవచ్చు.
మేము భద్రాచలం ఆలయ దర్శనం తరువాత, మా స్నేహితుడు పాల్వంచలో న్టీపీసీ అనుకుంట అందులో పనిచేస్తున్నాడు. ప్లాంట్ అవీ చూపించాడు. అక్కడ నుండి కిన్నెరసాని వెళ్ళాము.
కిన్నెర సాని వచ్చిందమ్మ యెన్నెల పైటేసి...
ఆ తరం వాళ్లకి ఈ పాట బాగా తెలుసు కదా ! అది ఇక్కడి కిన్నెర సాని గురించే. ఆ అనుభూతులు, కవిత్వం, భావోద్వేగాలు, ఊహలు ఆడండి జీవితం అస్సలు :). హాచ్ సత్యం :P.
కిన్నెరసాని దగ్గర జింకల పార్క్ & 'డామ్' వుంది.
కిన్నెరసాని దగ్గరకొచ్చేసాము అనగా రోడ్ పక్క ఒకామె అమెరికన్ పాప్ కార్న్ అప్పటికప్పుడే ఫ్రెష్ గా ఉడకబెట్టి అమ్ముతుంది. మా స్నేహితుడు అక్కడ ఆపి మరీ తినిపిస్తే అప్పుడు అనిపించింది నా జీవితంలో అంత రుచి ఎపుడూ చూడలేదు అని. జన్యు వర్తిత ఉత్పత్తి ఏమో అని భయంవేసింది కూడా. ఎందుకంటె ఈ మధ్య పళ్ళు, కూరగాయలలో 'కొత్త రంగులు & రుచులు' చూస్తే కాస్త గాభరాగానే ఉంటుంది.
జింకల పార్క్ లో గ్రాసం ఒకామె అమ్ముతున్నారు. మేము కొని జింకలకు తినిపించాము. వాటర్ రైడ్స్ పెట్టారు అవీ వున్నాయి. బావున్నాయి కాని చాలా టైం వేచివున్నాము. వారాంతం అంటే ఎక్కడైనా ఇలాగే వున్నట్టు వుంది.
అక్కడ నుంచి మా స్నేహితుడి ఇంటికి వచ్చి కాసేపు కూర్చుని బయలుదేరాము. వచ్చేటప్పుడు జీలుగుమిల్లి గురించి వచ్చే రోడ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. అమావాస్య ఎఫెక్ట్ వల్ల కూడా అనవసర ఆందోళనలు, మాటలు, వాదులాటలు జరిగినవి. అవి ఊహించినవే కదా ! అందుకే పెద్దలు పంచాంగం చూసేది. విత్తనం వేసినపుడు వాన పడాలి. వాన పడేసమయానికి విత్తనం వేసి ఉండాలి. ఇవన్నీ కాదు. భగవంతుని శరణాగతి చేయినవాడికి మాత్రం ఈ సూత్రం వర్తించదు :).
ఎంత గొప్ప ముహార్తానికి అయినా కొద్దిపాటి ఇబ్బందులు మాములే కదా !. అమావాస్య అయినా, పౌర్ణమి అయినా మన ప్రయత్నం మన చెయ్యటమే. ఆపై ఆ భద్రాద్రి రాముడి అనుగ్రహం.
కొన్ని ప్రయోజనకరమైన లింక్స్:
-----------------------------------
ఈనాడులో కాస్త సమగ్రంగా సమాచారం ఇచ్చారు. అది ఇక్కడ చూడండి
లింక్ 2
లింక్ 3
మరిన్ని క్షేత్ర విశేషాలు (జటాయుపాక, దుమ్ముగూడెం గ్రామ కథ, ఇతరాలు) ఇక్కడ చదవండి.
మా చిన్నప్పుడు ఊరూరా రామాలయాలు, ఊరి చివర నేనున్నా అంటూ గ్రామాన్ని రక్షకుడిలాగా వుండే హనుమాన్ విగ్రహాలు ప్రతి వూరిలోను కనిపించేవి.
శనివారం వచ్చిందంటే గుళ్లో భోగం అంటూ ఊరంతా ఒకే చోట చేరటం, సందడి చెయ్యటం, తులసి తీర్థం తీసుకోవటం, పూజ ఎపుడు అవుతుందా, పులిహోర ప్రసాదం ఎపుడు పెడతారా అని పిల్లలంతా ఎదురు చూడటం. ఆ వారానికి వూరి వారు ఎవరో ఒకరు ప్రసాద వితరణ చెయ్యటం. ఆరోజుల్లో గుడినుంచి బయటకు వచ్చేటప్పుడు కాసేపు కూర్చోటం అనేదానికి ఒక అర్థం కనిపించేది.
ఒక సంవత్సరం ముందు మళ్ళీ ఆ వూరు వెళ్ళినప్పుడు ఆ వైభవం అంతా గుర్తుకొచ్చింది.
గూటీబిళ్ళ ఆడుతూ భగవత్ గీత వినటం
----------------------------------------------------
చెప్పటానికి నవ్వొస్తున్నా, కొంచెం సిగ్గుగా కూడా వుంది. మైకులో రోజూ వచ్చే భగవత్ గీత, శ్రీ రామ నామామృతం పాటలు మా పిల్లలకి ఆ గుడి దగ్గర్లోనే ఆడుకోవటం వల్ల దాదాపు నోటికి వచ్చేసేవి. కోరస్ పాడుతూ ఆడుకునేవాళ్ళం :). సైకులు తొక్కుతున్నా, గూటి బిళ్ళ ఆడుతున్నా ఒక పక్క పాడుతూనే, హమ్ చేస్తూనే ఉండేవాళ్ళం. లేకపోతె అల్లరిగా మేమూ పాడేవాళ్ళం (ఆ పుణ్యమేమో ఇంకా పైకి పోకుండా చాలాసార్లు కాపాడింది :p).
ఇప్పుడు ఆ వైభవం అంతా పోయింది. ప్రతి విషయానికి కొలబద్ద డబ్బు మాత్రమే. కంప్యూటర్ జనరేషన్ పిల్లలు అని మురిసిపోవటమే. ఇప్పుడు ఇదొక్కటి తెలిస్తే అప్పటి పిల్లలకి జీవితం తెలుసు అంతే తేడా. తేడా అడిగారు అంటే మీరు కంప్యూటర్ జనరేషన్ కిడ్ అని అర్థం :)).
మొట్టమొదటి డాబా ఇల్లు మా మావయ్య వాళ్లది కావటం చేత డాబావారి ఇల్లు అని పిలిచేవారు.
ఇప్పుడు ఇద్దరు మావయ్యలు పోయాక, ఎవరు ఉండక తాళాలు వేసి వున్నాయి. పెద్ద పాలస్ లాంటిది పాడుబడుతుంది ఇప్పుడు.
రామాలయాలు స్థానంలో ఏవేవో వచ్చి ఆ ఆలయాలకు ఆదరణ కరువైపోయింది. చెప్పటం కూడా చాలా కష్టంగా వుంది.
దేశంలోనే రెండో పాడురంగని ఆలయంగా పేరుగాంచిన చిలకలపూడి (మచిలీపట్టణం) పాండురంగని ఆలయ దర్శనానికి వెళ్ళినపుడు, పూజారి గారు ఎక్కడ నుంచి వచ్చారు అమ్మా ! అని అడిగితె, బెంగళూరు అని చెప్పాము. అప్పుడు ఆయన, వున్న వూళ్ళోనే ఎవరూ పట్టించుకోవటం లేదు. మీరు అక్కడినుంచి దర్శనానికి వచ్చారా ! అని నిర్లిప్తంతో కూడిన మనసులోని మాటలు బయటకి వినపడటం ఇప్పటికీ గుర్తు వుంది.
ఏం చేస్తాం దేవుడు ఆలయాలని, భక్తిని, ఐతే సిలబస్ లో పెట్టాలి. లేకపోతె బ్రాండ్ మేనేజర్ ని ఒకడిని పెట్టుకోవాలి. కాదు, కూడదు అంటే 'వివాదమో లేక సంచలనమో' చెయ్యాలి.
మా వూళ్ళో నే కాదు. చాలా పల్లెటూళ్లలో అదే పరిస్థితి. రకరకాల దేవతలు, దేవుళ్ళు.. సాత్విక దేవతలతో పాటు, ఉగ్రరూప దేవతలు వచ్చేసారు.
శివాష్టోత్తర శతనామ స్తోత్రం అంటే రెండు నిముషాలు టైం కేటాయించటం అని చెబుతున్నారు. మనసొక చోట, తనువొక చోట. రెండు చేతులు జోడించడం అంటే ఏంటో తెలియదు. తెలిసినా మనసుకి అనుభూతిలో ఓలలాడదు. అంతా యాంత్రికం. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద (అయ్యో ! మావి బ్రాన్డెడ్ చెప్పులండి బాబు, పొతే ఎలాగ అంటారా ! ఐతే సరి ఇంక ఆ భగవంతుడే కాపాడాలి అని కోరుకోవటమే :(.
"శివో" అంటూ శివాష్టోత్తరం మొదలుపెట్టే మనం ఆ నామానికి అర్థం కనీసం మంగళకరం, మంగళాలు ఇచ్చేవాడు అని జ్ఞప్తికి ముఖ్యంగా అనుభూతికి తెచ్చుకుంటున్నామా ? ఎవరికి వారు ఆలోచించుకోవాలి ఇది ...?
పిండికొద్దీ రొట్టె అని అంటారు. అలా చేసే పూజా ఫలితాలు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోకపోవటమే మంచింది.
ఒక్కసారి, ఒక్క నామముతో మొదలెట్టండి. అర్థాన్ని అనుభూతిలోకి, అనుభంలోకి తెచ్చుకోండి. అద్భుతాలు చూస్తారు. శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు లాంటి పెద్ద ఎందుకు అన్ని సార్లు ఈ విషయాన్ని పదే, పదే చెబుతారో అప్పుడు అర్థం అవుతుంది.
సారీ డైవర్ట్ (?) అయ్యాను. మన యాత్ర లోకి వెళ్ళిపోదాం.
మా ఊరినుంచి భద్రాచలం సుమారు నూటపది కిలోమీటర్లు. బండి మీద వెళ్ళేటంత తక్కువ దూరం కాదు. అలా అని మరీ అసంభవం అనేటంత ఎక్కువా కాదు. ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల, మా వాళ్ల మిగతా కారణాల వల్లను, ఇద్దరం కలిసి బస్సు లో వెళితే, మరొకడు బండి మీద వచ్చాడు.
పొద్దుటే టీ, కాఫీలు తాగకపోతే పడిపోయే శరీరాలు కదా ! అందుకే బ్రేక్ జర్నీ చేసుకుంటూ వచ్చే దారిలో అల్పాహారం చేసుకుని భద్రాద్రి చేరుకున్నాము.
ముందుగా భద్రాద్రి చేరుకున్నాక సరాసరి గోదావరి ఘాట్ దగ్గరకి వెళ్ళాము. సరాసరి నదిలో స్నానం ఇష్టం లేక ఆ పక్కన వున్న టాయిలెట్స్ లో స్నానాదులు ముగించుకుని ఆలాగే సరాసరి తడిబట్టలతోనే నదీ స్నానం (నదీ స్నాన శ్లోకంతో సహా) కూడా ముగించుకుని ఆలయానికి బయలుదేరాము.
ఎపుడో డిగ్రీ చదువుకునేటప్పుడు వెళ్లిన పిక్నిక్ లో భాగంగా వచ్చేటపుడు దర్శనం చేసుకున్నాము అని స్నేహితుడు గుర్తు చేసాడు. అప్పటికి, ఇప్పటికి మొత్తం మారిపోయింది.
ఇక్కడ ఒక చిన్న విషయం మనవి చేసుకోవాలి. జనాభాపెరగటంతో పాటు భక్తులు కూడా రోజురోజుకి పెరుగుతున్నారు. అభివృద్ధి ఆవశ్యనీయం. అభివృద్ధి జరుగుతున్న సమయంలో మాత్రం ఆలయాన్ని దర్శించినప్పుడు మనసు చివుక్కుమంటుంది.
మొన్న మధ్య మా వాడు విజయవాడ టెంపుల్ దగ్గర దిగిన ఫోటో పంపిస్తే, ఎక్కడ అని అడిగానంటే పరిస్థితి అర్థం చేసుకోండి.
విజయవాడ అదే మన బెజవాడ కనకదుర్గ 'పెద్దమ్మ'ని ని చూడటానికి నేను కూడా వెళ్ళాను ఆ మధ్య . అక్కడ అమ్మవారి దర్శనం అయ్యాక, మల్లేశ్వర స్వామి దర్శనంకి వెళదామనుకుంటే బారికేడ్లు దర్శనమిచ్చాయి. దర్శనం లేదు అన్నారు. అంతకు ముందు కొత్తగా నటరాజస్వామి ఆలయం దగ్గర ఒక శివలింగం కనపడింది. పూజారి గారు తీర్థం ఇస్తున్నారు. కొత్త ఆలయం ఏమైనా పెట్టారా అనుకుంటూ అన్యమనస్కంగా తీర్థం తీసుకున్నా. కానీ తాత్కాలిక మల్లేశ్వర స్వామి అని తరువాత తెలిసింది.
రైల్ ఎక్కాలన్న తొందరలో వున్నానేమో అస్సలు ఆరు ఫ్లోర్లు ఎక్కడానికే అతి కష్టం అయింది. స్పెషల్ దర్శన్ టిక్కెట్ల రేట్లు చాలా పెంచేశారు. ఇందాక చెప్పినట్టు అభివృద్ధి అవసరమే కానీ ఎంత మూల్యానికి అన్నట్టు, ప్రాణప్రతిష్ట చేసిన, అత్యంత పురాతన వైభవం, మహాత్మ్యం కలిగిన గుడులను రాత్రికి రాత్రి లేపేస్తే అర్థం ఏమిటి ? ఎంత దారుణమైన ఫలితాలు వుంటాయో తెలియదా ? ఊహించడానికే భయం వేస్తుంది. యాథా రాజా ! తథా ప్రజా ! ఇలాంటివి చేస్తే మంచోడు, చెడ్డోడు అందరూ పోతారు అంతే సింపుల్. చేసినందుకు వాడు, అడగనందుకు వీడు.
కామేశ్వర శర్మ గారు అనుకుంట. కొన్ని సంవత్సరాలకు ముందు అత్యంత పురాతన, ప్రభాన్వితమైన మరియు వివిధ పురాణాలలో పేర్కొనబడిన ఆలయ నీటి కుండాలను పూడ్చి వాటి పైన లెట్రిన్స్ కట్టారు అని ఆ అర్చక స్వామి అత్యంత ఆవేదనతో ఒక పుస్తకం కూడా రాశారు.
ఇలాంటి విషయాలలో శాస్త్రోత్తంగా - ఆగమశాస్త్రాలో లేక మరొకటో, వేద పండితులు,పెద్దలు, అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్ళాలి. అంతే కానీ ప్రోక్లేన్లు, క్రేన్లు వంటి యంత్రాలో లేకపోతె బి.టెక్లు, ఎం.టెక్లు, 'బేక్ లాగులతో' పాస్ అయిన ఇంజినీర్ల సలహాలతో కాదు.
ఎటుపోయాము. సరే ఇప్పుడు వెనక్కి రండి, మన భద్రాద్రి యాత్ర లోకి.
మేము సుమారు 12 గంటల సమయంలో ఆలయంలోకి ప్రవేశించాము. భద్రాద్రి స్వామి పరివారసమేతంగా దర్శనమిచ్చాడు. ఆలయ దర్శన బ్రేక్ సమయం అనుకుంట. కంగారు పడుతున్నారు అందరూ.
మొత్తానికి మా దర్శనం అయింది. బ్రేక్ లోపు మేమే ఆఖరు దర్శనం అనుకున్నాము. ఆరోజు అమావాస్య . అమావాస్య రోజు ఎందుకు ప్రయాణాలు పెట్టుకోరో అనుభవ పూర్వకంగా అర్థం అయింది. తరువాత చెప్తాను. కాని ఏం చేస్తాము సమయం అట్టే లేదు. పరిస్థితులేమో పగబట్టాయి ఇంతకుముందు కూడా రకరకాల కారణాలతో వాయిదా పడింది. అందుకే దేవుడు పిలిస్తే ఇంక పరిగెత్తటమే. ఆలోచించకూడదు అనిపించి బయలుదేరాము.
గుడి మెట్లు ఎక్కేటప్పుడు కొన్ని వుపాలయాలు కనపడ్డాయి. సర్లే మళ్ళీ చూసుకుందామని పైకొచ్చేసాము. అక్కడ శాశ్వత సేవలు కూడా ఉన్నట్టు కనపడ్డాయి. తోచినంతమేర మొత్తం స్వామి అనుగ్రహం మేరకు ఆయన సేవకు రాయించాము. ఈ శరీరం వున్నా, పడిపోయిన, ఉత్తరోత్తర జన్మలు వున్నా, లేకపోయిన, ఆ జన్మలలో భక్తి వున్నా, లేకపోయిన శాశ్వతంగా భగవంతుని కైంకర్యం జరుగుతుంది.
శాశ్వత సేవలు అంటే నా దృష్టిలో మన శరీర ప్రయాణం ఇక్కడ ఆగినా, సాధనా ప్రయాణం కొనసాగించటమే !!!.
మీకో విషయం చెప్పాలి ముందు. మీకు రామ గుండిగ, లక్ష్మణ గుండిగ చరిత్ర తెలుసా ! ఇక్కడి అంబా సత్రం గురించి కూడా విన్నారా ? ఐతే ఇక్కడ చదవండి ముందు.
సరే అసలు భద్రాద్రి క్షేత్ర వైభవం గురించి ఒకటి రెండు మాటలు (అంతర్జాలం నుంచి)
మేనకా, హిమవంతుల పుత్రుడు భద్రుడు. భద్రుడు చేసిన తపస్సుకు మెచ్చి వరప్రధానంగా స్వామి సరాసరి వైకుంఠం నుంచి వచ్చి భద్రుడు కొండ రూపం దాల్చితే స్వామి ఆసీనులయ్యారు. అందుకే ఇది భద్రాద్రి & భద్ర+అచలం = భద్రాచలం అయింది.
ఇక్కడ స్వామి తొడ మీద అమ్మవారు ఆసీనులై దర్శనమిస్తారు. మనం చదువుకున్న కంచర్ల గోపన్న - అదే స్వామి మహా భక్తుడుగా పేరుగాంచిన శ్రీ రామదాసు. గుడి కట్టించినందుకు చెరసాలలో వెయ్యబడ్డాడు కదా తానీషా ప్రభువు చేత. ఆ రామచంద్ర ప్రభువే అప్పు చెల్లించి మరీ రామదాసుని అనుగ్రహించిన కథ మనకందరికీ తెలిసిందే కదా ! దాశరథి శతకం రాసింది కూడా ఈ రామదాసే మరి.
స్వామి వారి మరొక మహాభక్తుడు కబీర్. కబీర్ నకు ఆలయ ప్రవేశం నిరాకరిస్తే, అక్కడ దివ్య చిత్రాలు మాయమయ్యాయట. మళ్ళీ కబీర్ నాకు దర్శనానికి అనుమతించిన మీదటనే అవి ప్రత్యక్షమయ్యాయట.
సాధారణ రామాలయాలలోలాగ కాకుండా స్వామి ఇక్కడ నాలుగు చేతులతో శంఖ,చక్ర, ధనుర్భాణాలతో దర్శన మివ్వటానికి కారణం స్వామి వైకుంఠం నుండి సరాసరి దిగిరావటమే స్థలపురాణం చెబుతుంది. అందుకే ఇక్కడ స్వామిని వైకుంఠ రాముడుగా పిలుస్తారు. ఇక్కడ వైకుంఠ ఏకాదశికి, ఉత్తర ద్వార దర్శనానికి కూడా అంత ప్రాధాన్యం అందుచేతనే.
ఇక్కడ మన స్వామి సీతా, లక్ష్మణ సమేతుడై రామాయణ వనవాసకాలంలో నివసించిన ప్రదేశం పేరు పర్ణశాల. ఇక్కడే సీతమ్మ తల్లిని, రావణుడు మాయా వేషంలో అపహరించినది. అక్కడ గుర్తులు కూడా చూపిస్తారు. భద్రాద్రి వచ్చిన ప్రతివారూ పర్ణశాల కూడా చూసుకుని వెళతారు. ఈ మధ్య 'అభివృద్ధి' దెబ్బ ఇక్కడ కూడా పడింది. అక్కడ అంత పెద్దగా ఏమి లేదు ఇప్పుడు అని మరొక స్నేహితుడు చెప్పాడు. ఐతే అంతకు ముందు వెళ్ళటం వల్లను, సమయాభావం వల్లను మా స్నేహితుడు కొత్తగా ఏమీ లేదు అని చెప్పి ఉండవచ్చు. ఈ ట్రిప్ లో ఐతే పర్ణశాల వెళ్ళలేదు. భద్రాచలం నుంచి పర్ణశాల 35 కిలోమీటర్లు దూరం.
చెప్పటం మరిచిపోయాను. మీరు ప్రత్యేకంగా ఉండాలి మీ జర్నీ అనుకుంటే పోలవరం నుంచో, రాజముండ్రి నుంచో లాంచీ లో వెళ్ళండి గోదావరి అందాలు చూసుకుంటా. పాపికొండలు (పాపిడి కొండలు) ప్యాకేజీలు ఉంటాయి. ఏ.పీ.టీ.డి.సి. వాళ్ళను కూడా సంప్రదించవచ్చు.
మేము భద్రాచలం ఆలయ దర్శనం తరువాత, మా స్నేహితుడు పాల్వంచలో న్టీపీసీ అనుకుంట అందులో పనిచేస్తున్నాడు. ప్లాంట్ అవీ చూపించాడు. అక్కడ నుండి కిన్నెరసాని వెళ్ళాము.
కిన్నెర సాని వచ్చిందమ్మ యెన్నెల పైటేసి...
ఆ తరం వాళ్లకి ఈ పాట బాగా తెలుసు కదా ! అది ఇక్కడి కిన్నెర సాని గురించే. ఆ అనుభూతులు, కవిత్వం, భావోద్వేగాలు, ఊహలు ఆడండి జీవితం అస్సలు :). హాచ్ సత్యం :P.
కిన్నెరసాని దగ్గర జింకల పార్క్ & 'డామ్' వుంది.
కిన్నెరసాని దగ్గరకొచ్చేసాము అనగా రోడ్ పక్క ఒకామె అమెరికన్ పాప్ కార్న్ అప్పటికప్పుడే ఫ్రెష్ గా ఉడకబెట్టి అమ్ముతుంది. మా స్నేహితుడు అక్కడ ఆపి మరీ తినిపిస్తే అప్పుడు అనిపించింది నా జీవితంలో అంత రుచి ఎపుడూ చూడలేదు అని. జన్యు వర్తిత ఉత్పత్తి ఏమో అని భయంవేసింది కూడా. ఎందుకంటె ఈ మధ్య పళ్ళు, కూరగాయలలో 'కొత్త రంగులు & రుచులు' చూస్తే కాస్త గాభరాగానే ఉంటుంది.
జింకల పార్క్ లో గ్రాసం ఒకామె అమ్ముతున్నారు. మేము కొని జింకలకు తినిపించాము. వాటర్ రైడ్స్ పెట్టారు అవీ వున్నాయి. బావున్నాయి కాని చాలా టైం వేచివున్నాము. వారాంతం అంటే ఎక్కడైనా ఇలాగే వున్నట్టు వుంది.
అక్కడ నుంచి మా స్నేహితుడి ఇంటికి వచ్చి కాసేపు కూర్చుని బయలుదేరాము. వచ్చేటప్పుడు జీలుగుమిల్లి గురించి వచ్చే రోడ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. అమావాస్య ఎఫెక్ట్ వల్ల కూడా అనవసర ఆందోళనలు, మాటలు, వాదులాటలు జరిగినవి. అవి ఊహించినవే కదా ! అందుకే పెద్దలు పంచాంగం చూసేది. విత్తనం వేసినపుడు వాన పడాలి. వాన పడేసమయానికి విత్తనం వేసి ఉండాలి. ఇవన్నీ కాదు. భగవంతుని శరణాగతి చేయినవాడికి మాత్రం ఈ సూత్రం వర్తించదు :).
ఎంత గొప్ప ముహార్తానికి అయినా కొద్దిపాటి ఇబ్బందులు మాములే కదా !. అమావాస్య అయినా, పౌర్ణమి అయినా మన ప్రయత్నం మన చెయ్యటమే. ఆపై ఆ భద్రాద్రి రాముడి అనుగ్రహం.
కొన్ని ప్రయోజనకరమైన లింక్స్:
-----------------------------------
ఈనాడులో కాస్త సమగ్రంగా సమాచారం ఇచ్చారు. అది ఇక్కడ చూడండి
లింక్ 2
లింక్ 3
మరిన్ని క్షేత్ర విశేషాలు (జటాయుపాక, దుమ్ముగూడెం గ్రామ కథ, ఇతరాలు) ఇక్కడ చదవండి.
No comments:
Post a Comment